పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళలాడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎల్నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారమని పేర్కొన్నారు.
నేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నాడు ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ 2025 నిర్వహణపై విషప్రచారం మానుకోకుంటే ఉపాధ్యాయులంతా కదిలి సమరశంఖం పూరిస్తారని హెచ్చరించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జిలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. శిక్షణా తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుద్దా వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారంతోపాటు బుద్దా వెంకన్న జన్మదిన వేడుకలను కూడా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.
వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.
విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వైజాగ్ రైల్వే జోన్ రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యుత్తమ జోన్గా సౌత్ కోస్ట్ రైల్వే నిలిచిందని పేర్కొంది.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు గొప్ప నేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న నైపుణ్యం గల చేతులను గౌరవిద్దామని అన్నారు.