ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు.
విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాయికృష్ణ డెడ్బాడీని స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేశారని ఆరోపణలు వస్తుండటంతో అక్కడ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని.. ఈ ఏడాది యోగా డేను అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శమని కొనియాడారు.
యోగా సాధనతో బాబారామ్దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద అని చెప్పుకొచ్చారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని యోగా గురు బాబా రామ్దేవ్ అన్నారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని తెలిపారు.
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ తొలి విడత నిధులను ఈరోజు(శనివారం) విడుదల చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్లు జమకానున్నట్లు తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఈవో శీనా నాయక్ శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు, శానిటేషన్, భద్రతపై అధికారులతోపాటు సిబ్బందికి ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాయికృష్ణ కుటుంబసభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని సాయికృష్ణ తల్లి కోరారు.