సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం ముగిసింది. త్వరలోనే స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు సాకారమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. నెట్ జీరో ఎమిషన్ కాన్సెప్టుతో విద్యుత్ ఉత్పాదన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఎన్టీఆర్ జిల్లాలో వివాహితపై అత్యాచారయత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయారు.
ఏపీఎస్ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రశంసలతో తమకు బాధ్యత మరింత పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం మొదలైంది. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధన కోసం పది సూత్రాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది..
గుణదల మేరీమాత 102వ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మేరీమాత పుణ్యక్షేత్రం, బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాల గ్రౌండ్, పరిసర ప్రాంతాలు విద్యుత కాంతుల నడుమ వెలిగిపోతున్నాయి.
గురునానక్ కాలనీకి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. పిల్లల విద్య నిమిత్తం కొద్దినెలల క్రితం విజయవాడ వచ్చారు. సీబీఐ కేసు నమోదు చేసిందని సైబర్ నేరగాళ్లు ఆమెకు వీడియోకాల్ చేశారు. భయపడిపోయిన ఆమె వెంటనే రూ.కోటీ25లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో డబ్బు బదిలీ అయిన ఖాతాలను స్తంభింపజేశారు. వెంటనే ఆమె స్పందించడం వల్ల రూ.25 లక్షలను ‘ఈ’ కాప్స్ వెనక్కి రప్పించగలిగారు. గత ఏడాది జరిగిన ఘటన ఇది. సూర్యారావుపేటకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి పేరున విదేశాల నుంచి డ్రగ్స్ వచ్చాయని సైబర్ నేరగాళ్లు ముంబై క్రైం బ్రాంచ్ పేరు ఉపయోగించుకుని ఫోన్ చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని, బయటపడాలంటే తాము చెప్పిన ఖాతాలో డబ్బు జమ చేయాలని బెదిరించారు. ఆయన ముందుగా భయపడి రూ.25 లక్షలు జమ చేశారు. తర్వాత మళ్లీ మరో రూ.50 లక్షలు పంపాలని ఫోన్లపై ఫోన్లు చేస్తుండటంతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ ఫోన్ మాట్లాడేసరికి సైబర్ నేరగాళ్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ముందుగా రూ.25 లక్షలు పోగొట్టుకున్న ఆయన ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడం ద్వారా రూ.50 లక్షలు కాపాడుకోగలిగారు. ఇలాంటి సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ కీలకమంటున్నారు పోలీసులు. సైబర్ నేరం నిర్ధారణ అయ్యాక వీలైనంత త్వరగా స్పందించి పోలీసులకు సమాచారం ఇస్తే పోయిన డబ్బును తిరిగి రాబట్టవచ్చంటున్నారు.
రెండు దశాబ్దాలుగా జక్కంపూడి రైతులు తమకు రావాల్సిన ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్యూఆర్ఎం ఇళ్లు నిర్మించగా, మిగిలిన 60 శాతం రైతుల వాటాలోని స్థలం అభివృద్ధికి నోచుకోక.. ప్లాట్లు స్వాధీనం కాక.. భవన నిర్మాణాలకు అనుమతులు రాక అవస్థలు పడుతున్నారు. మా ప్లాట్లను ఎప్పటికి స్వాధీనం చేస్తారని కార్పొరేషన్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్లాట్ల సాధన కోసం ఉద్యమబాటకు శ్రీకారం చుడుతున్నారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కింద నగరంలో అద్దె ప్రాతిపదికన తీసుకున్న చెత్త తరలింపు వాహనాలు కార్పొరేషన్కు ఆర్థిక గుదిబండగా మారాయి. ఈ వాహనాలు ఇంటింటికీ వచ్చి తడి, పొడి చెత్తను సేకరిస్తున్నాయో లేదో తెలియదు కానీ, ఏడాదికి రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు బిల్లులు మాత్రం ఠంచనుగా చేరుతున్నాయి. వాహనాలు తిరక్కుండానే బిల్లులు చెల్లిస్తున్నారని, ఆ బిల్లుల మాటున అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. వీటి స్థానే కార్పొరేషన్ సొంతంగా వాహనాలను కొనడం ద్వారా ఖర్చుతో పాటు చెత్త సేకరణ కూడా తేలిక అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శనివారం ఉదయం 5.30 గంటల సమయం... స్లీపర్ ఏసీ బస్సుల్లో 39 మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా బస్సు ఇంజన్ నుంచి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్.. ప్రయాణికులందరినీ నిద్రలేపి సురక్షితంగా కిందకు దింపారు. కళ్లముందే భారీగా మంటలు వ్యాపించి బస్సు అగ్నికి ఆహుతవుతుండగా, వారంతా నిద్రమత్తులో నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నారు. కంచికచర్ల-కీసర వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదంలో ప్రయాణికులంతా మృత్యుంజయులుగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి 'క్వాంటమ్ వ్యాలీ'కు ఈ రోజు శంకుస్థాపన జరిగింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే, #AmaravatiQuantumValley అనే హ్యాష్ట్యాగ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్లోకి వచ్చింది.