సంత్ త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. శ్రీరాముని భక్తిలో లీనమై, ఆయన తన జీవితమంతా తత్వశాస్త్రం, భావోద్వేగం, దైవానుభూతిని ఏకం చేసే సంగీతాన్ని స్వరపరచడానికి అంకితం చేశారని పవన్ కొనియాడారు
ఒమన్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్ను ఉద్యోగం పేరుతో ఏజెంట్ కార్యాలయం నిర్బంధించింది.
కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్లో సోమవారం తెల్లవారుజామున ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యపై కోపంతో, భర్త తన సోదరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ డ్రెయిన్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు డిప్యూటీ సీఎం వినూత్న కార్యక్రమం చేపట్టారని కొనియాడారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఏపీని నాశనం చేశారని ధ్వజమెత్తారు.
విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థినిలపై లైంగిక వేధింపుల ఘటనపై సీఎం చంద్రబాబు సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు బాధ్యులపై వైద్యారోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.
ఏపీ ఉపాధ్యాయుల బృందం ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్లో పర్యటించనుంది. సింగపూర్ పర్యటనకు ఏపీలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో 'స్వచ్ఛరథాలు' కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో, నేచురల్ స్టార్ నాని సహాయం చేయడంపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. నాని సహాయంపై ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. అడిగిన వెంటనే సాయం చేయడంపై ప్రశంసలు కురిపించింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసే లేబర్ అడ్డా నిర్మాణాలు.. అందరికీ పని దొరికేలా చూడటంతో పాటు నైపుణ్య శిక్షణా కేంద్రాలుగానూ మారతాయని మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. మన మిత్ర యాప్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.