తాడిగడపలో గురువారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి 100 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, రూ.2.30 లక్షల నగదు దోచుకెళ్లారు. కిటికీకి అమర్చిన ఇనుప ఫ్రేమ్ను శబ్ధం రాని చార్జింగ్ కటర్తో కట్చేసి ఇంట్లోకి ప్రవేశించారు. దోపిడీలో మొత్తం నలుగురు దొంగలు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కొన్నిరోజుల నుంచి పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో కృష్ణా యూనివర్సిటీకి మంచిరోజులు కనిపిస్తున్నాయి. 14 నెలలుగా ఇన్చార్జి రిజిస్ర్టార్ పాలనలోనే వర్సిటీ కొనసాగుతుండగా, ఇటీవల జరిగిన వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి కమిషనర్ కొత్త రిజిస్ర్టార్ను నియమిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో నూతన రిజిస్ర్టార్ నియామకంపై ప్రచారం జోరందుకుంది. అలాగే, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై వర్సిటీలో పాలన గాడిన పడనుంది.
ఈ రోజు దేశం మొత్తం ఉమెన్ ఎంపవర్మెంట్ నినాదంతో గ్రామగ్రామాన ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రూరల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, లఖ్పతి దీదీ ఈ కాన్సెప్ట్స్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి మతిస్తిమితం లేని కుమార్తె ఉంది. చిన్నారిని ఇంటి వద్దనే ఉంచి పనుల నిమిత్తం తల్లిదండ్రులు అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న త్రినాథ్ అనే కామాంధుడి కళ్లు బాలికపై పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల మెుత్తం ఉపవాస దీక్షలు చేశారని.. దాని ఫలితం సమాజానికి చేరుతుందని అన్నారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చెరువులు నింపడానికి జలవనరుల శాఖ అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటివరకు వేసవికి కేటాయించిన నీటిలెక్కలను పరిశీలించి ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.
వెస్ట్ బైపాస్పై పూర్తిస్థాయిలో రాకపోకలు సాగించడానికి వీలుగా ఎన్హెచ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామనవమి నుంచి పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నారు.
యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయంలో జరిగిన అక్రమాల్లో విచారణపై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పరారీలో ఉన్న ఈవో భవానీ అక్రమాలతో పాటు గతంలో పనిచేసిన మరో ఈవో గంగాధర్ హయాంలోనూ అక్రమాలు వెలుగుచూడగా, దేవదాయ శాఖ మాత్రం కేవలం భవానీ అక్రమాలపై మాత్రమే విచారణకు ఆదేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంగాధర్ హయాంలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ జరపాలంటూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఫిర్యాదులు అందుతున్నాయి. - (ఆంధ్రజ్యోతి, విజయవాడ)
మాజీ సీఎం జగన్పై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు లేవని, కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పూర్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం పటమట లంక నుంచి శ్మశానవాటిక వరకు ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు.