• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా, ఆ స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.

ఏపీలో త్వరలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్..

ఏపీలో త్వరలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన 'యువగళం' హామీని నెరవేర్చే దిశగా మంత్రి నారా లోకేశ్ కసరత్తు ప్రారంభించారు.

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి సజీవ దహనం

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి సజీవ దహనం

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు.

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు.

అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు..

అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో తాత్కాలిక మార్పులు చేసింది. బీఎల్‌ఓ విధులు ఉన్న కేంద్రాలు జూన్ 29 నుంచి జులై 28 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

షైనింగ్ స్టార్స్‌ను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

షైనింగ్ స్టార్స్‌ను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' సత్కార కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ టాపర్లను ఘనంగా సన్మానించారు.

 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, సాంకేతికత, ప్రజా విధానాలు, నాలెడ్జ్ షేరింగ్‌కు వేదికగా ఈ సదస్సును నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాయలసీమ అభివృద్ధి, ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?: వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్

రాయలసీమ అభివృద్ధి, ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?: వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్

నేడు కూటమి ప్రభుత్వం రాయలసీమను పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మార్చిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. 2019–2024 మధ్య ఆ పార్టీ పాలనలో గొడ్డలి ఫ్యాక్టరీలు, ఫేక్ ఫ్యాక్టరీలు వచ్చాయి.. తప్ప కడప స్టీల్ ప్లాంట్ మాత్రం రాలేదని వ్యంగ్యంగా అన్నారు.

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్‌పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

విశ్వ నగరంగా అమరావతిని రాష్ట్రానికి అందించే వరకూ పోరాటం: రాజధాని రైతులు

విశ్వ నగరంగా అమరావతిని రాష్ట్రానికి అందించే వరకూ పోరాటం: రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిని ఆ ప్రాంత రైతులు ఎండగట్టారు. అమరావతిని చంపేందుకు నేటికి అనేక కుట్రలు చేస్తున్నారంటూ జగన్‌పై రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి