Home » Andhra Pradesh » Guntur
బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేశ్కి ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం శాసనమండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసింది.
దేశంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ కేవలం 24 నెలల్లోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో 1600 మందికి రూ.200 కోట్ల పరిహారం అందనుంది. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి చెక్కులు అందజేయనున్నారు.
గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వారు ప్రసంగించారు.
బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. వారి సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
గనుల శాఖలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించే ఉన్నతాధికారి.. ఒక క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో యజమానులకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అరెస్టు చేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వాసవి గ్రానైట్ క్వారీలో ఈ ఏడాది జూన్ 25న ప్రమాదం జరిగింది.