Home » Andhra Pradesh » Guntur
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు విదేశీ ప్రయాణాలు తగ్గించి.. దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఇంధన పొదుపుతో పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు.
ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భవన్లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సమావేశమైంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తీర్మానాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా పలువురు సభ్యులు హాజరయ్యారు.
దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మత్స్యకారుల వలసలు తగ్గించి, తీరప్రాంతాల్లోని వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆస్పత్రులకు రూ.919.13 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీ మోడల్ స్కూల్స్లో కాంట్రాక్ట్ సిబ్బంది సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. 123 మంది ఫిజికల్ డైరెక్టర్లు, 120 మంది కంప్యూటర్ టీచర్ల సేవలను పునరుద్ధరించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి ఆరా తీశారు. ఇటీవల పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నేతలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) భారీ పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ప్రతినిధులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.