బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరు చేయడం ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)కి ఆదాయం సమకూరుతోంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొక్క నాటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు నేడు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు.
పర్యావరణహితమే ధ్యేయంగా ప్రయోగాత్మకంగా తయారుచేసిన గ్రీన్ ఇంద్రా ఏసీ బస్సు గురువారం ఉదయం తిరుపతికి చేరుకుంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మతిస్థితిమితం కోల్పోయింది. తిరుపతికి చెందిన ఉమాశంకర్ తన భార్య నీరజ, పిల్లలు శాన్విక(9), చార్వీశ్రీ(5)తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం సోమవారం వచ్చారు.
ప్రముఖ పర్యాటక కేంద్రమైన తలకోనలో గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓ మదగజం పర్యాటకులపైకి దూసుకొచ్చింది. తలకోన సిద్ధేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శిగా శ్రీవిద్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
దేవదాయ శాఖలో తిరుపతి కేంద్రంగా వున్న రీజనల్ జాయింట్ కమిషనర్-2 పోస్టులో ప్రభుత్వం కే.బీ.శ్రీనివా్సను నియమించింది.
జిల్లాకు మరో అత్యున్నత స్థాయి విద్యా సంస్థ రాబోతోంది. శ్రీసిటీ యాజమాన్యం కింద ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది.
హీరోయిన్ జాన్వీ కపూర్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్చరణ్తో నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల సందర్భంగా పిన్నమ్మ మహేశ్వరి, స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి కాలినడకన జాన్వీ కపూర్ తిరుమలకు వచ్చారు.
రాష్ట్ర ఖజానా లెక్కల శాఖలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పలువురు సీనియర్ అకౌంటెంట్లకు సబ్ ట్రెజరీ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ రాష్ట్ర డైరక్టర్ పద్మజ ఉత్తర్వులు జారీచేశారు.