స్వాతంత్య్ర దినోత్సవం సంధర్బంగా శనివారం స్విమ్స్లో ఓపీలు, ఓటీలకు సెలవు ప్రకటించినట్లు డైరెక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ద్రౌపదీ సమేత ధర్మరాజు స్వామి తిరునాళ్లను పురస్కరించుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు.
అనే నేను, అంటూ విద్యార్థులు తమ భవితను ఆవిష్కరించారు. భవిష్యత్తులో తాను డాక్టర్, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్, ఏఐ ఇంజనీరు.. అంటూ తమ లక్ష్యాలు.. సమాజానికి ఉపయోగపడేలా ఏం చేస్తామనే వివరాలతో చార్ట్ ఫొటో ప్రేమ్లను రూపొందించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ విడుదల చేసిన రిజర్వేషన్ల సిఫార్సుల్లో జిల్లాలోని బీసీలకు మంచి ప్రాతినిధ్యం దక్కింది. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ వార్డు సభ్యుల వరకు పలు స్థానాల్లో బీసీలకు కేటాయింపుల్ని కమిషన్ ప్రతిపాదించింది.
బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం సిద్ధించి 79ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ కొన్ని గ్రామాలు అనాగరికంలో ఉన్నామంటే అతిశయోక్తి కాదు. సమాజం శాస్త్ర, సాంకేతిక పరంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా పలు గ్రామాల ప్రజలు ప్రాథమిక అవసరాలకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందంటే వారికి నిజంగా స్వాతంత్య్రం వచ్చినట్లేనా? అన్న ప్రశ్న రాకమానదు.
మూడేళ్ల చిన్నారి జాతీయ రహదారిపై 79 కిలోమీటర్ల పాటు స్కేటింగ్ చేస్తూ ప్రపంచ రికార్డుకు ప్రయత్నిస్తున్నాడు. శుక్రవారం మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్ట సర్కిల్ నుంచి సత్యసాయి జిల్లా కదిరి వరకు స్కేటింగ్ యాత్ర ప్రారంభించాడు.
టమోటాకు నెల రోజులుగా గిట్టుబాటు ధర లభించడం లేదు. సోమల మార్కెట్లో జూలై నుంచి 15 కిలోల బాక్సు నాణ్యమైన కాయలు రూ.150 మాత్రమే పలికాయి. ఈ నెల 11, 12 తేదీల్లో 15కిలోల బాక్సు రూ.250 నుంచి రూ.300 పలికింది. 13న రూ.150కి పడిపోయింది.
జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న చెడ్డీగ్యాంగ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి.
తిరుపతి జిల్లా పుత్తూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.