తిరుమల పరకామణి కేసు వారం రోజుల విరామం అనంతరం సోమవారం నుంచి పునఃవిచారణ ప్రారంభం కానుంది. సీఐడీ సిట్ బృందం ఆదివారం తిరుపతికి చేరుకుంది.
సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. పద్మావతి నగర్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం, సత్యసాయి సేవాసమితి ఆఽధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
శ్రీపద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
మహిళలు ఒకరిమీద ఆధారపడే అవసరం లేకుండా స్వయంప్రకాశకులుగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆకాంక్షించారు.
పులిచెర్ల మండలంలో మూడేళ్లుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల మంద ఐదు రోజుల క్రితం మండలాన్ని వీడాయి. తిరుపతి జిల్లా అడవుల వైపు వెళుతున్న ఏనుగుల మంద మళ్లీ మళ్లీ తిరిగి పులిచెర్ల మండలం వైపే చూస్తున్నాయి.
గంగాధర నెల్లూరు మండలం ఎట్టేరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
నియోగదారుడి వద్ద గ్యాస్ సిలిండర్కు అధిక ధర వసూలు చేసిన పుంగనూరులోని వీరభద్ర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి రూ. 10వేల జరిమానా విఽధించాలని డీఎస్వో శంకరన్ను కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా జిల్లాకు కేటాయించే నిధులను సకాలంలో ఖర్చు చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అధికారులను ఆదేశించారు.
పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష ఘట్టమైన పంచమితీర్థం ఈనెల 25వ తేదీన జరుగనుంది. అమ్మవారి పుష్కరిణి పద్మసరోవరంలో జరిగే ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచాలని ఇండియన్ రైల్వే కోచింగ్ విభాగం ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవీన్కుమార్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు.