జిల్లా వ్యాప్తంగా బుధవారం 94.43 శాతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,32,880 మందికిగాను తొలి రోజున 2,19,906 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారన్నారు.
చిత్తూరు-తచ్చూరు హైవేపై ట్రయల్ రన్ మొదలైంది. ఈ మార్గంలో బుధవారం పలు వాహనాలు ప్రయాణించాయి. ఈ హైవే మొత్తం 116 కిలోమీటర్లు. అనుపల్లె, అరతల, నరసింహాపురం, పల్లిపట్టు, నగరి, ఊతుకోట, కుమారరాజపేట, ఎస్ఆర్పురం, వీరకావేరిరాజపురం, పొందవాక్కం.. ఈ ఏడు చోట్ల హైవేపైకి చేరడానికి లింకు రోడ్డు సదుపాయముంది.
చేనేత, మరమగ్గాల యజమానుల చిరకాల కోరిక నెరవేరింది. తమిళనాడు తరహాలో ఇక్కడా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్తును బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. తమిళనాడులో 2008లో మర మగ్గ, చేనేతలకు ఉచిత కరెంటును అక్కడి ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల వారి ఉత్పత్తి ఖర్చు తగ్గింది.
తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లె భూముల రిజిస్ర్టేషన్లను ఈ నెల 10 నుంచి చేపడుతున్నట్లు తుడా వీసీ గోవిందరావు తెలిపారు.తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, రేణిగుంట సబ్రిజిస్ర్టార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులు రిజిస్ర్టేషన్కు సంబంధించిన ఆధారాలు, పత్రాలు తీసుకెళ్ళి రిజిస్ర్టేషను చేసుకునేలా చూడాలని తుడా అధికారులను ఆయన ఆదేశించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో ముగింపురోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత కృష్ణస్వామి ఉత్సవమూర్తులతో కలిసి మలయప్పస్వామి మాడవీధుల్లో దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది.2,63,368మందికి పెన్షన్ అందజేయాల్సి వుండగా 2,49,100మందికి పంపిణీ చేశారు.
తిరుపతి జిల్లాలో కారు ప్రమాదం నుంచి పలువురు ప్రయాణికులు తప్పించుకున్నారు. కారు నుంచి మంటలు చెలరేగే లోపే వాహనాన్ని దిగేసి పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కాయి.
చిత్తూరు జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రెండు రోజుల క్రితం చంద్రమ్మ అనే మహిళ కనిపించకుండా పోయింది. పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది.
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ రథాన్ని ఎత్తు పెంచడానికి ఆలయ బోర్డు తీర్మానించింది, మంగళవారం ఆలయ సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది.
జిల్లాలో పది రోజులుగా సూర్యుడు మండుతుండడంతో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో చేరుకుంటున్నాయి. ఉదయం 9 గంటలకే నెత్తిమీద నిప్పుల కుంపటి పెట్టుకున్నట్లు ఉంటుంది. ఉదయం 10 గంటలు దాటితే బయట తిరగలేని పరిస్థితి.