రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్ల ప్రోత్సాహకాలు మంజూరు చేసిందని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ కృష్ణకిశోర్ పేర్కొన్నారు.
‘లోకేశ్ సర్..నేను చదువుకున్న పాఠశాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు..మీరైనా కాపాడండి సార్’ అంటూ పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు వాట్సాప్ ద్వారా లేఖ రాసింది.
ములకలచెరువు, మండలంలోని సోంపాళ్యంలో ఉన్న పురాతన చెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం రాత్రి గుప్త నిధుల దొంగలుపడ్డారు. విద్యుత్ సరఫరా నిలిపేసి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు రాతి కల్యాణ మండపం లోపల పైభాగంలో ఉన్న మొగ్గలాంటి శిల్పాన్ని పగులగొట్టారు.
కుప్పం పట్టణంలోని నేతాజీ రోడ్డు విస్తరణ పనులకు రూ.7.41 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ల కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తమ నివాస ఆవరణలో మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు సమావేశం ఏర్పాటుచేశారు.
చిత్తూరు జిల్లాలో 2024కు మించిన విజయం 2029 ఎన్నికల్లో రావాలి. ఆ మేరకు అంతా కలిసి పనిచేయాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్, ఎస్పీలతో శుక్రవారం సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి అంశాల గురించి.. ప్రజాప్రతినిధుల, అధికారుల పనితీరు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాదరెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, గురజాల జగన్మోహన్, పులివర్తి నాని, మురళీమోహన్, థామస్, గాలి భానుప్రకా్షతో పాటు కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ తుషార్ పాల్గొన్నారు.
హైవేలలో ప్రమాదాలు జరిగినప్పుడు తొలి గంట గోల్డెన్ అవర్గా చెబుతారు. ఆ గంటలోగా అవసరమైన చికిత్స అందిస్తే 90 శాతం ప్రాణాలు కాపాడవచ్చు. ట్రామా కేర్ సెంటర్తో ఇది సాధ్యమవుతుంది. హైవేలు.. రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ఒక్కటీ లేదు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
శుక్రమౌడ్యం, గురు మౌడ్యంతో 83 రోజుల పాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి.
వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారాయన.
చిత్తూరు శివారులోని ఇరువరం సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ కారుపై పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు.