బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా రాంరెడ్డి, వెంకట్యాదవ్ ఎన్నిక
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:16 AM
తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రాంరెడ్డి, వైస్ చైర్మన్గా చలకాని వెంకట్యాదవ్ ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా జీ కిరణ్కుమార్ విజయం సాధించారు.
బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్ గెలుపు
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రాంరెడ్డి, వైస్ చైర్మన్గా చలకాని వెంకట్యాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇం డియా (బీసీఐ) మెంబర్గా జీ కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఈ పదవులకు ఎన్నిక నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల ద్వారా ఎన్నికైన 26 మంది బార్ కౌన్సిల్ సభ్యులు ఈ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చైర్మన్ పదవికి పోటీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్కు 11 ఓట్లు, టీ హనుమంత్రెడ్డికి 3 ఓట్లు, సాముల రాంరెడ్డికి 12 ఓట్లు వచ్చాయి. వైస్ చైర్మన్ పదవికి పోటీ చేసిన గోకుల్ రామారావుకు 3 ఓట్లు, చలకాని వెంకట్యాదవ్కు 13 ఓట్లు, జాకీర్ హుస్సేన్ జావిద్కు 10 ఓట్లు వచ్చాయి. బీసీఐ మెంబర్ పదవికి పోటీ చేసిన ఆకుల అనంత్సేన్రెడ్డి 3 ఓట్లు, అనిల్ కిరణ్కుమార్ 2 ఓట్లు, డీ జగదీశ్వర్కు 7 ఓట్లు, జీ కిరణ్కుమార్ 10 ఓట్లు, పాశం సుజాతకు 4 ఓట్లు వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
77 వేల కోట్లు మూలుగుతున్నాయ్!
Read Latest AP News And Telangana News And National News
And Telugu News