Share News

కోర్టు చెప్పినా రంగనాథ్ తీరు మారడం లేదు: రాంచందర్ రావు

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:51 PM

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసార్ హాట్ కామెంట్స్ చేశారు. కోర్ట్‌ను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు.

కోర్టు చెప్పినా రంగనాథ్ తీరు మారడం లేదు: రాంచందర్ రావు
Ramchander Rao

హైదరాబాద్, ఆగస్టు 10: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసార్ హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు(సోమవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైకోర్టు చెప్పినా రంగనాథ్ తీరు మారడం లేదని వ్యాఖ్యానించారు. కోర్ట్‌ను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు. నాదర్‌గుల్‌లో చాలా ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఎందుకు పరిరక్షించడం లేదని ప్రశ్నించారు. అక్కడ ఎన్నో ఎకరాల భూమిలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని తెలిపారు.


రంగనాథ్‌కు మజ్లీస్ మీదున్న ప్రేమ.. ప్రజల మీద లేదని విమర్శించారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెబుతున్న హైడ్రా.. మరి ఆ భూములను ఎక్కడ దాచిపెట్టారని.. ఎందుకు ప్రజల ముందు ఉంచడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణయాగం చేస్తే.. తాము రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోవాలని వాయు యాగం చేస్తామన్నారు. వానాకాలం అంతా అయిపోయాక రేవంత్ రెడ్డిది ఇదో కొత్త నాటకమంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ఉన్న విషయం సీఎంకు తెలియదా అని రాంచందర్ రావు ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

మనుషులకు ‘ఆధార్’ లాగే.. భూములకూ ‘భూధార్’: మంత్రి పొంగులేటి

కోటి మందికిపైగా స్మార్ట్‌ రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నాం: జగ్గారెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 04:51 PM