11 అడుగుల వెండి కొండ..!!
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:59 AM
సిరిసిల్లలోని రామలాల్ మండపం వద్ద 2,016 వెండి గణేశుడి ప్రతిమల సమాహారంతో 11 అడుగుల రజత వినాయకుడిని రూపొందించి ప్రతిష్ఠించారు.
సిరిసిల్లలో రజత వినాయకుడు
సిరిసిల్ల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో వెండి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. అవును... సిరిసిల్లలోని రామలాల్ మండపం నిర్వాహకులు వెండితో తయారు చేసిన 2016 గణేశుడి ప్రతిమల సమాహారంతో ఓ 11 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. నాందేడ్కు చెందిన కళాకారులు ఈ సిల్వర్ గణపతిని తయారు చేశారు. ఈ మండప నిర్వాహకులు గత సంవత్సరం 10,116 స్పటిక లింగాలను ఉపయోగించి పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా మట్టిని ఉపయోగించి విగ్రహాన్ని తయారు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News