టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:50 PM
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. మూడో రోజు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో కేశర నువాంతను ఔట్ చేసి ఈ అరుదైన క్లబ్లో చేరాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్గా జడ్డూ రికార్డు సృష్టించాడు. అనిల్ కుంబ్లే(619 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్(537), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) ఈ జాబితాలో ఉన్నారు.
దీంతో పాటు, టెస్టు క్రికెట్ చరిత్రలో 4 వేలకు పైగా పరుగులు, 350 వికెట్లు పడగొట్టిన నాలుగో ప్లేయర్గా జడేజా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(5,248 పరుగులు, 434 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ డానియల్ వెటోరి(4,531 పరుగులు, 362 వికెట్లు), ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ ఇయాన్ బోతమ్(5200 పరుగులు, 383 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్టుల్లో 4 వేలకుపైగా పరుగులు, 350కి పైగా వికెట్లు తీసిన భారత ప్లేయర్లలో ఇప్పటి వరకు కపిల్ దేవ్ మాత్రమే ఉండటం విశేషం. ఇప్పుడు అతడి సరసన జడేజా వచ్చి చేరాడు.
ఇవి కూడా చదవండి:
గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే?
శుభ్మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?