Share News

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల దగ్గర తప్పనిసరి వసతులు

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:34 PM

వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ జారీ చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల దగ్గర తప్పనిసరి వసతులు
Election Commission guidelines 2026

ఆంధ్రజ్యోతి, మార్చి 22: వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం (ECI) కీలక ఆదేశాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 2,18,807 పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను (CEOs) ఆదేశించింది.

ఓటర్లకు 'ష్యూరిటీ'.. పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరి వసతులు: ఓటింగ్ శాతాన్ని పెంచడంతో పాటు, ఓటర్లకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేందుకు ఎన్నికల సంఘం 'అష్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్' (AMF) పేరుతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

మౌలిక సదుపాయాలు: ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్లు, ఎండ తగలకుండా వెయిటింగ్ ఏరియాలో నీడ ఉండాలి. దివ్యాంగులు, వృద్ధుల కోసం శాశ్వత ర్యాంపులను ఏర్పాటు చేయాలి. ఓటర్లు నిలబడాల్సిన అవసరం లేకుండా, వరుస క్రమంలో నిర్ణీత దూరంలో బెంచీలను ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రం వెలుపల మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఓటర్లు తమ ఫోన్లను అక్కడ అప్పగించి, ఓటు వేసిన తర్వాత తిరిగి తీసుకోవచ్చు.


ఓటర్ అసిస్టెన్స్ బూత్‌లు (VABs):

ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉండే బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs) ఓటర్లకు వారి సీరియల్ నంబర్, ఇతర వివరాలను వెతకడంలో సహాయపడతారు. దీనివల్ల ఓటర్లు తమ పేరు కోసం కంగారు పడాల్సిన అవసరం ఉండదు.

సమాచార పోస్టర్లు: ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు నాలుగు రకాల ప్రామాణిక పోస్టర్లను (VFP) ప్రదర్శిస్తారు.

1. పోలింగ్ కేంద్రం వివరాలు.

2. అభ్యర్థుల జాబితా.

3. ఓటర్లు చేయదగినవి మరియు చేయకూడనివి (Do's and Don'ts).

4. ఓటు వేసేందుకు అనుమతించే గుర్తింపు కార్డుల వివరాలు కేంద్రాల దగ్గర ఉంచుతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 01:40 PM