Share News

భరత్‌నగర్‌లో కుళ్లిన చికెన్‌ సరఫరా

ABN , Publish Date - Mar 28 , 2026 | 08:49 AM

ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా కుళ్లిన చికెన్‌ను నిల్వ ఉంచి భరత్‌నగర్‌ పరిధిలోని హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

భరత్‌నగర్‌లో కుళ్లిన చికెన్‌ సరఫరా

  • 352 కిలోలు స్వాధీనం... ఒకరు అరెస్టు

హైదరాబాద్‌ సిటీ: ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా కుళ్లిన చికెన్‌ను నిల్వ ఉంచి భరత్‌నగర్‌ పరిధిలోని హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సుమారు 352 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ వెల్లడించారు. హెచ్‌-ఫాస్ట్ బృందం వెటర్నరీ అధికారి డాక్టర్‌ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్‌నగర్‌, జింకలవాడ(Bharat Nagar, Jinkalavada) ప్రాంతంలో ఉన్న ’మెసర్స్‌ ఎస్‌.పి.ఆర్‌ చికెన్‌‘ ప్రాంగణంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.


city4.2.jpgఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. ఈ మాంసాన్ని స్థానిక హోటళ్లు, చికెన్‌ విక్రేతలకు సరఫరా చేస్తున్నారని, లైసెన్స్‌ గడువు కూడా ముగిసిందని విచారణలో తేలింది. ఈ కేసులో రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన సూరజ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేసి సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మార్కెట్‌కు చమురు మంట

త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 08:49 AM