Share News

రాజమండ్రి: గోదావరి జలాల కాలుష్యంపై పవన్ కల్యాణ్ దృష్టి

ABN , Publish Date - May 26 , 2026 | 09:44 AM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకట్ నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు వ్యర్థ జలాలు కలుస్తున్న లంకలను పరిశీలించారు.

రాజమండ్రి: గోదావరి జలాల కాలుష్యంపై పవన్ కల్యాణ్ దృష్టి
Deputy CM Pawan Kalyan

రాజమండ్రి, మే 26: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకట్ నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు వ్యర్థ జలాలు కలుస్తున్న లంకలను పరిశీలించారు. బోటుపై ప్రయాణించిన డిప్యూటీ సీఎం.. ఆంధ్రా పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నదిలో కలుస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. కాలుష్యం వల్ల స్థానికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు.


బోటులో ప్రయాణిస్తున్న సమయంలో స్థానిక మత్స్యకారులతో డిప్యూటీ సీఎం మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గోదావరి నదీ జలాల కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్.. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజమండ్రి రూరల్ ప్రాంతంలో జరిగిన ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. ట్రోల్స్‌పై శ్రేయస్ సోదరి ఆవేదన

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2026 | 09:56 AM