Share News

Rohit-BCCI: రోహిత్ వారసుడు ఫిక్స్.. సరైనోడ్నే పట్టేశారు

ABN , Publish Date - May 08 , 2025 | 09:53 AM

BCCI: టీమిండియా టెస్ట్ టీమ్‌కు కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా రిటైర్మెంట్ తీసుకోవడంతో అతడి వారసుడు ఎవరనే దాని గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

Rohit-BCCI: రోహిత్ వారసుడు ఫిక్స్.. సరైనోడ్నే పట్టేశారు
Team India

ప్లేయర్లతో పాటు క్రికెట్ లవర్స్‌ అంతా ఐపీఎల్ హడావుడిలో ఉండగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. త్వరలో వరల్డ్ టెస్ట్ సిరీస్ న్యూ సైకిల్ మొదలుకానున్న నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ మధ్యలోనే హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్ చేశాడు. దీంతో భారత టెస్ట్ టీమ్‌కు కొత్త సారథి ఎవరనే డిస్కషన్స్ ఊపందుకుంటున్నాయి. కెప్టెన్సీ రేసులో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ లాంటి కుర్రాళ్లతో పాటు సీనియర్ స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం సరైనోడ్ని ఎంపిక చేసిందని తెలుస్తోంది. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


అనౌన్స్‌మెంట్ అప్పుడే..

రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవడంతో అతడి స్థానంలో కొత్త సారథిని దాదాపుగా ఫిక్స్ చేశారట. హిట్‌మ్యాన్ వారసుడిగా 25 ఏళ్ల గిల్‌ను ఖాయం చేశారని.. త్వరలో అతడికి పగ్గాలు అప్పగించడం పక్కా అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లంతా గిల్ వైపే మొగ్గు చూపారని.. దీనిపై త్వరలో బీసీసీఐతో డిస్కస్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి. బోర్డు పెద్దలు కూడా గిల్‌‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నారట. సెలెక్టర్లతో మీటింగ్ తర్వాత అతడి పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.


నో చెబితే..

పంత్ రూపంలో బలమైన ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ గిల్ వైపే సెలెక్టర్లు, బీసీసీఐ మొగ్గు చూపుతున్నాయని తెలుస్తోంది. బుమ్రాకు కెప్టెన్సీ అనుభవం ఉన్నా గాయాల బెడద వల్ల అతడ్ని పరిగణనలోకి తీసుకోవడం లేదట. రోహిత్ వన్డేల నుంచి తప్పుకున్నాక అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలను గిల్‌కే అప్పగించాలనేది బోర్డు ప్లాన్ అని సమాచారం. ఈ మేరకు భారత జట్టు ఆటగాళ్లతోనూ చర్చలు జరిపి.. వాళ్ల రివ్యూస్ తీసుకోవాలని భావిస్తున్నారట. ఎవరైనా సీరియర్లు నో చెబితే.. వాళ్లను ఒప్పించి గిల్‌ను లీడర్‌గా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారని నెట్టింట వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీసే సారథిగా శుబ్‌మన్‌కు ఫస్ట్ అసైన్‌మెంట్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం.


ఇవీ చదవండి:

ప్లేఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్

రోహిత్‌కు దక్కే పెన్షన్ ఎంతంటే..

ఈడెన్‌కు బాంబు బెదిరింపు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 08 , 2025 | 09:56 AM