PM Modi-IPL 2025: మోదీ పర్మిషన్ ఇస్తారా.. బీసీసీఐకి కొత్త టెన్షన్
ABN , Publish Date - May 12 , 2025 | 09:58 AM
IPL Restart: ఐపీఎల్-2025ని రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ బోర్డు. అన్నీ కుదిరితే ఈ వారాంతంలో క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం తేల్చుతుందనేది ఆసక్తికరంగా మారింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2025 ఈ వారాంతంలో స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు సీజ్ఫైర్కు అంగీకరించడంతో పరిస్థితులు క్రమంగా యథాస్థితికి చేరుకుంటున్నాయి. దీంతో క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచుల్ని త్వరగా ఫినిష్ చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. టోర్నీ రీస్టార్ట్ చేయడంపై ఐపీఎల్ పాలకసభ్యులు, బీసీసీఐ పెద్దలు ఆదివారం డిస్కస్ చేశారు. మిగతా సీజన్ మ్యాచులకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్పై చర్చలు జరిపారు. అయితే మోదీ సర్కారు పర్మిషన్ ఇస్తే గానీ టోర్నీ మొదలవదు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే క్యాష్ రిచ్ లీగ్ రీస్టార్ట్ ఆధారపడి ఉంది. ఇదే విషయాన్ని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పాడు.
తేల్చేస్తారా..
ఐపీఎల్ మీద ఇప్పటిదాకా ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదన్నాడు రాజీవ్ శుక్లా. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. అయితే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ మీదే అంతా ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఇవాళ భారత్-పాక్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో డిస్కషన్స్ నడుస్తాయి. సీజ్ఫైర్తో పాటు ఉద్రిక్త వాతావరణం తగ్గించడం లాంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ డిస్కషన్స్ తర్వాతే కాల్పుల విరమణపై పూర్తి స్పష్టత రానుంది. గుంటనక్క లాంటి పాక్.. భారత్ను రెచ్చగొట్టేందుకు మళ్లీ దాడులకు తెగబడదని కూడా చెప్పలేం. కాబట్టి ఈ విషయాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ను ఇంకొన్నాళ్ల తర్వాత జరపాలా.. లేదా.. రాబోయే వారం, పది రోజుల్లో నిర్వహించాలా అనేది తేల్చే చాన్సులు ఉన్నాయి. అందుకే ఐపీఎల్కు మోదీ పర్మిషన్ ఇస్తారా.. లేదా ఇంకొన్ని వారాలు వాయిదా వేయాలని చెబుతారా.. అనేది క్లారిటీ లేదు.
ఇవీ చదవండి:
నాకు కెప్టెన్సీ అక్కర్లేదు: బుమ్రా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి