Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు..
ABN, Publish Date - Feb 17 , 2025 | 07:20 PM
ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబసమేతంగా మహాకుంభమేళాకు హాజరయ్యారు. షాహీ స్నాన్ ఘట్టం సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్ష్తో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా తీసిన ప్రత్యేక ఫోటోలు మీకోసం..

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దంపతులు మహా కుంభమేళాలో పాల్గొన్నారు. షాహీ స్నాన్ ఘట్టంలో సాంప్రదాయబద్ధంగా త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేశారు.

ఈ సందర్భంగా లోకేష్, బ్రాహ్మణి దంపతులు గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు. కుమారుడు దేవాన్ష్ కూడా తల్లిదండ్రులను అనుసరిస్తూ సంప్రదాయాలు ఆచరించాడు.

పితృదేవతలను స్మరించుకుంటూ లోకేష్ దంపతులు బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు.పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు.

కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు.

మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక.

కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి వెళ్లారు.
Updated at - Feb 17 , 2025 | 07:23 PM