Yanamala Ramakrishna: యనమల రామకృష్ణుడు రాజకీయ ప్రస్థానంపై పుస్తకం ఆవిష్కరణ
ABN, Publish Date - Apr 11 , 2025 | 10:29 AM
యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితంపై ‘42వ వసంతాల యనమల రాజకీయ ప్రస్థానం’ పేరుతో పుస్తకం ప్రచురించారు. కాకినాడ జిల్లా తునిలో ఈ పుస్తకావిష్కరణ, ఆత్మీయ సన్మాన వేడుకను గురువారం నాడు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, నారాయణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు , కూటమి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.
1/8
యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితంపై ‘42వ వసంతాల యనమల రాజకీయ ప్రస్థానం’ పేరుతో పుస్తకం ప్రచురించారు.
2/8
కాకినాడ జిల్లా తునిలో ఈ పుస్తకావిష్కరణ, ఆత్మీయ సన్మాన వేడుకను గురువారం నాడు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, నారాయణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు , కూటమి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.
3/8
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హోంమంత్రి అనిత
4/8
42 ఏళ్ల యనమల రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా వెలుగొందారని, ఇది రాజకీయాల్లో అద్భుత ఘట్టమని హోం మంత్రి అనిత అభివర్ణించారు.
5/8
సుదీర్ఘ రాజకీయాల్లో యనమల స్పీకర్గా, పలుమార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చేలా స్ఫూర్తిదాయకమైన పాలన అందించారని హోం మంత్రి అనిత ఉద్ఘాటించారు.
6/8
రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేతగా యనమల రామకృష్ణుడు ఎదిగారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
7/8
పుస్తకం ఆవిష్కరణ అనంతరం చదువుతున్న హోంమంత్రి అనిత
8/8
యనమల రామకృష్ణుడుకి సంబంధించిన ఫొటోలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ ఫొటోలను ఆసక్తిగా తిలకిస్తున్న హోంమంత్రి అనిత
Updated at - Apr 11 , 2025 | 10:43 AM