Home » Tuni
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబసభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రెండేళ్ల చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరమని హోం మంత్రి అన్నారు.
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ కీలక విషయాలు వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, పాప ఆచూకీ కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో కేసు దర్యాప్తులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ ఆటలు సాగనీయబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘‘నంద్యాలలో వైఎస్ విగ్రహంపై వైసీపీ వాళ్లే దాడిచేసి సానుభూతి రాజకీయాలు చేద్దామనుకుని కుట్ర పన్నారు.
పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఈరోజు(సోమవారం) పర్యటించనున్నారు. తుని నియోజకవర్గం, చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
తునిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న టీడీపీ నేతలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.