NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:04 PM
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మెల్బోర్న్: అనంతపురం శాసన సభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మెల్బోర్న్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ఇదిలా ఉంటే, పేదల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమంలో వీలైనంత ఎక్కువమంది ప్రవాసాంధ్రులు భాగస్వామ్యం కావాలని నిర్ణయించినట్లు మెల్బోర్న్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లగడపాటి సుబ్బారావు తెలిపారు.

నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తమ వంతు సహకారం అందించాలని ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రవాసాంధ్రులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మెల్బోర్న్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లగడపాటి సుబ్బారావుతో పాటు ఉపాధ్యక్షులు గోపి నంబల్ల, రాం ముప్పనేని, మారుతీ ప్రకాశ్, సుమ తతీన, సుమన్ దాసరి, రాం త్రిప్రనేని, శ్రీకాంత్ కోనిడనీ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నట్లుగా నిర్వహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్
ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్
For More AP News and Telugu News