Tungabhadra: ‘తుంగభద్ర’కు భారీ భద్రత
ABN , Publish Date - May 10 , 2025 | 01:30 PM
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు సాగునీరందించే తుంగభద్ర రిజర్వాయర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల నేపధ్యంతో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తున్నారు.

మునిరాబాద్ వైపు నుంచి ప్రవేశం బంద్
బళ్లారి(బెంగళూరు): పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్పై ప్రతిదాడికి దిగడంతో తుంగభద్ర(Tungabhadra) ఆనకట్ట వద్ద నిఘాను పెంచారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో ఒకటైన తుంగభద్ర ఆనకట్ట భద్రతను నిర్ధారించేందుకు కర్ణాటక పారిశ్రామిక భద్రతాదళాన్ని కొన్ని సంవత్సరాలుగా మోహరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల కారణంగా తుంగభద్ర ఆనకట్ట వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: దానికి తెలియదుగా.. ఆమె ఐఏఎస్ అధికారి అని.. ఏం జరిగిందంటే..
టీబీ ఆనకట్ట సిబ్బంది, జలవిద్యుత్ కేంద్ర సిబ్బందితో సహా ఆనకట్టలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆనకట్ట భద్రత కోసం కర్ణాటక పారిశ్రామిక భద్రతా దళం నుంచి డీవైఎస్పీ, ఇన్స్పెక్టర్, ఆరుగురు ఏఎస్ఐలు, 17మంది హెడ్ కానిస్టేబుళ్లు, 12మంది కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్తో సహా మొత్తం 39 మంది సిబ్బందిని నియమించారు.
రిజర్వాయర్ పరిసరాల్లో భారీ భద్రత.. ప్రవేశం పరిమితం..
కేంద్రం ఆదేశాల మేరకు తుంగభద్ర ఆనకట్ట వద్ద కఠినమైన భద్రత విధించారు. జలాశయం ఎడమ వైపు నుంచి వీక్షించడానికి ప్రజల ప్రవేశం పరిమితం చేశారు. జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి ఆదేశాల మేరకు కర్ణాటక పారిశ్రామిక భద్రతా దళం స్థానిక పోలీసులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ప్రజల దర్శనం నిలిపివేశారు. సెలవు రోజుల్లో ప్రజలు హొస్పేట ప్రాంతం నుంచి రిజర్వాయర్ వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎడమ వైపు నుంచి ప్రవేశించడం నిషేధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Drone Attacks: ఉద్రిక్తంగానే..
Miss World 2025: మిస్వరల్డ్ పోటీలకు 5వేల మందితో భద్రత
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News