Home » Ballari
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురవడంతో 13,800 క్యూసెక్కుల వరద వస్తోంది.
ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి.
తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.
కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్ రెడ్డి(26) మృతిచెందారు.
కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్రెడ్డి మరణించారని, మిస్ ఫైరింగ్ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.
రాజశేఖర్ అంతిమ సంస్కారాలపై పలు అనుమానాలున్నాయని మాజీమంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ మృతదేహాన్ని పూడ్చే సంప్రదాయం ఉన్నా.. కాల్చారని ఆయన అన్నారు.
మాజీమంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై బళ్లారి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే.. అంటూ పేర్కొనడం గమనార్హం.