Home » Ballari
తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.
కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్ రెడ్డి(26) మృతిచెందారు.
కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్రెడ్డి మరణించారని, మిస్ ఫైరింగ్ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.
రాజశేఖర్ అంతిమ సంస్కారాలపై పలు అనుమానాలున్నాయని మాజీమంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ మృతదేహాన్ని పూడ్చే సంప్రదాయం ఉన్నా.. కాల్చారని ఆయన అన్నారు.
మాజీమంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై బళ్లారి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే.. అంటూ పేర్కొనడం గమనార్హం.
విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రులు శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ... యువకుడి మరణానికి కారణమైన బుల్లెట్ ఎవరి గన్ నుంంచి వచ్చిందో పోలీసుల విచారణలో తేలిపోతుందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన బంగారం బిస్కెట్ల పంచాయితీ పెద్దల వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా.. మొత్తం రూ. 88 కోట్ల వరకు చెల్లించాలని తేల్చినప్పటికీ మొత్తం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది.
పెద్దలు తీసుకున్న నిర్ణయం ఓ యువతికి శాపంగా మారింది. పెద్దల తప్పు కారణంగా ఆ యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రేమించిన వాడితో కాకుండా వేరే వాడితో పెళ్లి చేయడానికి ప్రయత్నించటంతో యువతి ఆత్మహత్య చేసుకుంది.
ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆయన తన కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.