Pak Attack: మళ్లీ దాడి చేసిన పాక్..
ABN , Publish Date - May 09 , 2025 | 09:20 PM
ఇక జైసల్మేర్, యూరీలో బ్లాక్ అవుట్ అయింది. అనంతరం సైరన్లు మోగాయి. అలాగే హర్యానాలోని పంచకులతోపాటు పంజాబ్లోని ఫిరోజ్పూర్లో బ్లాక్ అవుట్ అయింది.

న్యూఢిల్లీ, మే 09: భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం చీకటి పడడంతో పాక్ మళ్లీ కాల్పులకు తెగబడుతూ.. డ్రోనులతో దాడులు చేస్తోంది. యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో.. పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ ఎంత వేగంగా కాల్పులు జరుపుతుందో.. భారత్ అంతే వేగంతో వాటిని సమర్థవంతంగా తిప్పికోడుతోంది.
ఇక జైసల్మేర్, యూరీలో బ్లాక్ అవుట్ అయింది. అనంతరం సైరన్లు మోగాయి. అలాగే హర్యానాలోని పంచకులతోపాటు పంజాబ్లోని ఫిరోజ్పూర్లో బ్లాక్ అవుట్ అయింది. జమ్మూ,అఖ్నూర్లో సైరన్లు మోగాయి. దీంతో ఆ ప్రాంతాన్నిబ్లాక్ అవుట్ చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హై అలర్ట్ను సైనిక దళాలు ప్రకటించాయి.
మరోవైపు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని ఎయిర్పోర్టులను మూసివేసింది. మే 10 నుంచి 15వ తేదీ వరకు 28 ప్రధాన ఎయిర్పోర్టులు మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే గుజరాత్ సరిహద్దుల్లో సైతం హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూకశ్మీర్లో డ్రోన్ దాడులు చేసేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ విఫలం చేసింది. సాంబా,పఠాన్కోట్లోని సెక్టార్లలో పాక్ డ్రోన్లను సైన్యం కూల్చివేసింది.
మరోవైపు.. దేశంలోని 24 ఎయిర్ పోర్టుల మూసివేతను మే 15 తేదీ ఉదయం వరకు కేంద్రం పొడిగించింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరాల్సిన మొత్తం 138 విమానాలను పలు విమానయాన సంస్థలు రద్దు చేశాయి. అలాే దేశవ్యాప్తంగా ఎయిర్ట్ పోర్టులలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.
ఇక విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. మే 8వ తేదీన దేశంలోని అనేక ప్రదేశాలపై పాకిస్తాన్ చేసిన దాడులను భారత్ తప్పి కోట్టందన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగి.. దేశంలోని పలు నగరాలతోపాటు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన వివరించారు. భారత సాయుధ దళాలు తగిన విధంగా స్పందించాయని చెప్పారు. ఈ దాడులను పాకిస్తాన్ అధికారికంగా తిరస్కరించడాన్ని మిస్రి విమర్శించారు. ఇది ఒక స్పష్టమైన అబద్ధమని ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపారు.
Also Read:
Akash Missile: భారత్- పాక్ యుద్ధం.. ఆ మిసైల్ సృష్టికర్త ఆయనే.
Operation Sindoor: ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ
Operation Sindoor: సైబర్ దాడి.. బిగ్ అలర్ట్
పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశాం
Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
For National News And Telugu News