-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Telangana Assembly Budget Session 2025 AP Assembly Parliament Live Updates In Telugu News Thursday 13th March 2025 NDN
-

Breaking News: తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్
ABN , First Publish Date - Mar 13 , 2025 | 10:33 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-13T16:12:05+05:30
ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది అసెంబ్లీ: భట్టి విక్రమార్క
సభా మర్యాదను కాపాడుకోవడం అందరి బాధ్యత.
జగదీశ్ రెడ్డి వ్యాఖ్యాలు చాలా బాధాకరం.
గవర్నర్, స్పీకర్ను అవమానించేలా మాట్లాడారు.
స్పీకర్ చైర్ను అందరూ గౌరవించాల్సిందే.
ఉన్నతమైన సభలో స్పీకర్ను అవమానించడం హేయం.
గవర్నర్ను కూడా బీఆర్ఎస్ సభ్యులు అవమానించారు.
సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరు అత్యంత బాధాకరం.
సభ మీ సొంతం కాదంటూ మాట్లాడటమేంటి?
కొన్ని వర్గాలంటే బీఆర్ఎస్కు గిట్టదు.
బీఆర్ఎస్ సభ్యుల వ్యవహారశైలి దురదృష్టకరం.
మీకు కేసీఆర్ నేర్పింది ఇదేనా?
జగదీష్రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలి.
జగదీష్రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలి.
-
2025-03-13T16:09:44+05:30
స్పీకర్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు: ఉత్తమ్
అసెంబ్లీ BRS సభ్యుల తీరు దురదృష్టకరం.
స్పీకర్ను అవమానించడం సహించరానిది.
జగదీష్రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే.
ఏకవచనంతో స్పీకర్నుద్దేశించి మాట్లాడటం హేయం.
-
2025-03-13T16:07:55+05:30
జగదీష్రెడ్డి తీరు అత్యంత జుగుప్సాకరం: మంత్రి సీతక్క
స్పీకర్ను అవమానించడం సరికాదు.
స్పీకర్ అంటే పదవి మాత్రమే కాదు.. ఒక వ్యవస్థ.
జగదీష్రెడ్డి వ్యాఖ్యల వీడియో సభ ఎదుట పెడతాం.
కాంగ్రెస్ కార్యకర్త అంటూ.. గవర్నర్ను కూడా BRS సభ్యులు అవమానించారు.
స్పీకర్ను టార్గెట్ చేయడం అత్యంత బాధాకరం.
జగదీష్రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి.
-
2025-03-13T16:07:06+05:30
స్పీకర్ను జగదీష్రెడ్డి అవమానించారు: వేముల వీరేశం
జగదీష్రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే.
దళితులంటే బీఆర్ఎస్కు చిన్నచూపు.
స్పీకర్ను అవమానించిన జగదీష్రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.
చైర్ను ప్రశ్నించడాన్ని తెలంగాణ సమాజం బాధపడుతుంది.
బలహీన వర్గాలకు పెద్ద స్థానం కల్పిస్తే గర్వపడ్డాం.
ఏక వాక్యంతో చైర్ను ప్రశ్నించడం దురదృష్టం.
దళిత స్పీకర్ను అవమానించినట్లు భావిస్తున్నాం.
అవమానించిన సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి.
-
2025-03-13T16:05:26+05:30
తెలంగాణ: వాయిదా అనంతరం తెలంగాణ అసెంబ్లీ తిరిగి ప్రారంభం
అసెంబ్లీలో భారీగా మార్షల్స్ మోహరింపు
జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం
జగదీశ్ రెడ్డిపై చర్యలు చేపట్టాలని అధికారపక్షం పట్టు
-
2025-03-13T16:04:04+05:30
తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్
ప్రస్తుత సెషన్కు సస్పెండ్ చేసిన స్పీకర్
బడ్జెట్ సెషన్ ముగిసే వరకు జగదీశ్ రెడ్డి సస్పెన్షన్
సస్పెండైన సభ్యుడు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశం
-
2025-03-13T15:54:18+05:30
దళిత స్పీకర్ ఉన్నారు కాబట్టే అహంకారంగా మాట్లాడారు: రామ్ చంద్రు నాయక్
సభ్యుని భాష అవమానకరం
ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుంది
గతంలో దళితుడిని సిఎం చేస్తామని చేయలేదు..
దళిత డిప్యూటీ సిఎంను బర్త్ రఫ్ చేసి అవమానించారు..
దళిత స్పీకర్ ను అవమానించిన సభ్యుని పై చర్యలు తీసుకోవాలి
-
2025-03-13T14:26:51+05:30
స్పీకర్ను అవమానించలేదు: హరీష్ రావు
స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానించలేదన్నారు హరీష్ రావు.
సభ మీ ఒక్కరిదే కాదు.. అందరిదని జగదీష్ అన్నారని చెప్పుకొచ్చారు.
మీ అనే పదం సభా నిబంధనలకు విరుద్ధం ఎలా అవుతుందని హరీష్ ప్రశ్నించారు.
మీ ఒక్కరిదే అనే పదం అన్-పార్లమెంటరీ వర్డ్ కాదన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తనకు తెలియదన్నారు హరీష్.
సభలో జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియో రికార్డు తీయాలని స్పీకర్ను కోరామన్నారు.
15 నిమిషాలైనా స్పీకర్ వీడియో రికార్డు తెప్పించలేదన్నారు.
-
2025-03-13T14:19:24+05:30
కావాలనే వృథా చేస్తున్నారు: పాయల్ శంకర్
బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కై.. శాసనసభ సమయాన్ని వృథా చేస్తున్నాయని చెప్పారు.
10 ఏళ్ల వ్యవహారాలు చర్చకు రాకుండా బీఆర్ఎస్ భయపడుతోందన్నారు పాయల్ శంకర్.
15 నెలల వైఫల్యాలు చర్చకు రాకుండా కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని సీరియస్ అయ్యారు.
ఇరు పార్టీల తీరు చూస్తే సభ నడవకూడదనే ధోరణిలో ఉందన్నారు బీజేపీ నేత.
గవర్నర్ ప్రసంగంపై అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. టైం గడిపేస్తున్నారని పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు.
-
2025-03-13T14:12:11+05:30
ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.
గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించానని చెప్పారు.
అన్నదాతల ఇబ్బందులు చూశాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు సీఎం.
విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడని తనను అవహేళన చేశారన్నారు చంద్రబాబు.
ఆ టైమ్లోనే డిస్కమ్లు, నియంత్రణ మండలి, ఎనర్జీ ఆడిటింగ్ స్టార్ట్ చేశామన్నారు.
-
2025-03-13T13:17:54+05:30
సీఎస్కే నెవర్ బిఫోర్ రికార్డ్
మైదానంలో రికార్డుల దుమ్ముదులిపే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సోషల్ మీడియాలోనూ అదే ఊపు ప్రదర్శించింది.
సీఎస్కే కొత్త చరిత్ర సృష్టించింది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో 17 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా సీఎస్కే రికార్డ్ క్రియేట్ చేసింది.
ఐపీఎల్ హిస్టరీలో ఏ జట్టుకూ ఇన్స్టాలో ఇన్ని మిలియన్ల ఫాలోవర్లు లేరు.
-
2025-03-13T12:41:35+05:30
రేవంత్తో డీఎంకే నేతల భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డీఎంకే ఎంపీలు కనిమొళి, రాజా, ఎన్ ఇలాంగో, కళానిధి వీరస్వామి భేటీ అయ్యారు.
తమిళనాడులో మార్చి 22వ తేదిన డీలిమిటేషన్ మీద జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా రేవంత్కు విజ్ఞప్తి చేశారు డీఎంకే నేతలు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
2025-03-13T11:58:30+05:30
తెలంగాణ అసెంబ్లీ 15 నిమిషాల పాటు వాయిదా పడింది.
సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత స్పీకర్ను జగదీష్ అవమానించారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీరియస్ అయ్యారు.
-
2025-03-13T11:40:41+05:30
పాత సామాను పోవాలె
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో కొంతమంది ఎంపీలు , ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ లేఖ విడుదల చేశారు రాజా సింగ్.
తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.
బీజేపీ సర్కారు రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఇది నా పార్టీ అనే వాళ్లు తెలంగాణలో చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాంటి వారిని రిటైర్ చేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజా సింగ్ స్పష్టం చేశారు.
-
2025-03-13T11:36:33+05:30
వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతోంది.
రైతు రుణమాఫీ కాలేదని.. రైతు భరోసా రాలేదని జగదీష్ రెడ్డి అన్నారు.
జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా అధికార పక్షం అభ్యంతరం తెలిపింది.
జగదీష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
దళితుడ్ని సీఎం చేస్తామని బీఆర్ఎస్ చెప్పిందని.. కానీ చేయలేదన్నారు కోమటిరెడ్డి.
దళితులకు 3 ఎకరాలు ఇస్తామని ఇవ్వలేదని దుయ్యబట్టారు.
అబద్ధాలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
అన్నదాతల కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసనని పేర్కొన్నారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం ఎవరు కట్టారో అందరికీ తెలుసునని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని.. తొందరపడొద్దని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
-
2025-03-13T11:32:20+05:30
పాక్ ట్రైన్ హైజాక్.. బందీలంతా సేఫ్..
పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనలో మొత్తం 21 మంది ప్యాసింజర్లు మృతి చెందారని ఆ దేశ ఆర్మీ జనరల్ తెలిపారు.
నలుగురు పారామిలిటరీ సైనికులు కూడా చనిపోయారని అన్నారు.
ఈ ఆపరేషన్లో భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు.
ట్రైన్లో ఉన్న మిలిటెంట్లను తమ భద్రతా దళాలు హతమార్చాయని.. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ముగిసిందన్నారు షరీఫ్.
-
2025-03-13T10:53:57+05:30
4 రోజులు బ్యాంకులు బంద్
హోలీ పండుగ కావడంతో శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు జరగవు.
మార్చి 21న బడ్జెట్ మీద చర్చించనున్నారు. మూడ్రోజుల పాటు పద్దులపై డిస్కషన్స్ నడుస్తాయి.
దాదాపుగా 11 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నడుస్తాయి.
దేశంలో ఈ రోజుతో పాటు రేపు కూడా పలుచోట్ల బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.
మార్చి 13న హోలికా దహన్ నేపథ్యంలో డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చి 14న హోలీ పండుగ నేపథ్యంలో దాదాపుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.
అన్ని చోట్లా సెలవు ఉన్నా శనివారం నాడు చెన్నై, అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, ఇంఫాల్, కొచ్చి, కోహిమా, తిరువనంతపురంలో మాత్రం బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతాయి.
-
2025-03-13T10:50:05+05:30
నడవలేని స్థితిలో ద్రవిడ్
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కాలికి గాయంమైంది.
బెంగళూరులో క్రికెట్ ఆడుతుండగా ఆయన గాయపడినట్లు తెలుస్తోంది.
ఇంజ్యురీ కారణంగా రాజస్థాన్ రాయల్స్ క్యాంప్లో ఆలస్యంగా జాయిన్ అయ్యాడు ద్రవిడ్.
ఆర్ఆర్ ట్రెయినింగ్ క్యాంప్లో తాజాగా పాల్గొన్న ద్రవిడ్.. చేతికర్రల సాయంతో నడుస్తూ కనిపించాడు.
-
2025-03-13T10:47:46+05:30
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు స్టార్ట్ అయ్యాయి.
గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాష్ట్ర సర్కారు తరఫున విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానంపై చర్చ జరగనుంది.
హోలీ పండుగ కావడంతో శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు జరగవు.
మార్చి 21న బడ్జెట్ మీద చర్చించనున్నారు. మూడ్రోజుల పాటు పద్దులపై డిస్కషన్స్ నడుస్తాయి.
దాదాపుగా 11 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నడుస్తాయి.