Share News

BREAKING: రైల్వేస్టేషన్ సమీపంలో గోనె సంచిలో మహిళ మృతదేహం

ABN , First Publish Date - Sep 20 , 2025 | 06:32 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: రైల్వేస్టేషన్ సమీపంలో గోనె సంచిలో మహిళ మృతదేహం

Live News & Update

  • Sep 20, 2025 20:14 IST

    అమెరికా H-1B వీసా నిబంధనలపై స్పందించిన భారత్

    • H-1B వీసా కొత్త నిబంధనలు పరిశీలిస్తున్నాం: విదేశాంగశాఖ

    • H-1B వీసా పరిణామాలను అధ్యయనం చేస్తున్నాం: విదేశాంగశాఖ

    • ఇది అమెరికా, భారత్‌లోని సంస్థలను ప్రభావితం చేసే అంశం

    • అమెరికా నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు: విదేశాంగశాఖ

    • సున్నిత అంశాలపై విధాన నిర్ణేతలు ఆచితూచి అడుగులు వేయాలి

    • కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందిని..

    • అమెరికా గుర్తిస్తుందని ఆశిస్తున్నాం: భారత విదేశాంగశాఖ

  • Sep 20, 2025 20:14 IST

    సెంచరీ చేసిన స్మృతి మంధాన..

    • భారత్ తరఫున వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేసిన స్మృతి మంధాన

    • ఆస్ట్రేలియాపై 50 బంతుల్లోనే సెంచరీ చేసిన స్మృతి మంధాన

    • మహిళల వన్డే క్రికెట్‌లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన మంధాన

  • Sep 20, 2025 15:18 IST

    హైదరాబాద్: చర్లపల్లి పీఎస్ పరిధిలో మృతదేహం కలకలం

    • రైల్వేస్టేషన్ సమీపంలో గోనె సంచిలో మహిళ మృతదేహం

    • నిన్న ఉ.11గంటలకు మృతదేహం పడిసి వెళ్లినట్టు గుర్తింపు

  • Sep 20, 2025 13:53 IST

    టీటీడీ పరకామణిలో చోరీ వీడియో విడుదల చేసిన భానుప్రకాష్‌రెడ్డి

    • పరకామణిలో రవికుమార్‌ దోచుకుంటే..

    • వైసీపీ నేతలు, అధికారులు పంచుకున్నారు: భానుప్రకాష్‌రెడ్డి

    • కోట్లాది రూపాయలను రియల్‌ ఎస్టేట్‌లో పెట్టారు..

    • వైసీపీ హయాంలో రూ.100 కోట్లు దోచుకున్నారు..

    • అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నారు

    • చోరీ అంశంపై భూమన సమాధానం చెప్పాలి..

    • అప్రూవర్‌గా మారనున్న ఓ అధికారి అన్నీ బయటపెడతారు..

    • త్వరలో అందరి పేర్లు బయటకు వస్తాయి: టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి

  • Sep 20, 2025 13:02 IST

    పట్టాలపై సిగరెట్‌ తాగుతుండగా.. రైలు ఢీకొని..

    • రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

    • తెల్లవారుజామున బొల్లారం బజారు రైల్వే స్టేషన్ వద్ద ఘటన

    • ముగ్గురు స్నేహితులు రైలు పట్టాలపై కూర్చుని సిగరెట్ తాగుతుండగా రైలు ఢీకొని ఇద్దరు మృతి.

    • ఒకరి పరిస్థితి విషమం.. గాయపడిన వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు

  • Sep 20, 2025 11:47 IST

    ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కంపెనీ కీలక ఆదేశాలు..

    • టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

    • హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

    • తమ ఉద్యోగులకు స్టార్ట్ ఇమీడియట్లీ ఆదేశాలు జారీ చేసింది.

    • ‘హెచ్ 1బీ, హెచ్ 4 వీసాలు ఉన్న మా ఉద్యోగులు రేపటి లోగా అమెరికాలోకి వచ్చేయాలి.

    • హెచ్ 1బీ, హెచ్ 4 వీసాలు కలిగి.. ప్రస్తుతం బయటి దేశాల్లో ఉన్న ఉద్యోగులు గడువు తేదీలోగా అమెరికా చేరుకోవాలి’ అని స్పష్టం చేసింది.

    పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • Sep 20, 2025 11:36 IST

    మాజీ ఎమ్మెల్యేపై సీఎం రమేష్ ఫిర్యాదు

    • మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎమ్ రమేష్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

    • ఇటీవల సీఎం రమేష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

    • ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గాదరి కిశోర్.. తనపై దూషణలకు దిగారని సీఎమ్ రమేష్ పేర్కొన్నారు.

    • దరి కిశోర్‌కు నోటీసులు ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు.

    • ఈరోజు ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకానున్న గాదరి కిశోర్

    పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • Sep 20, 2025 09:30 IST

    కుషాయిగూడలో దారుణం

    • భార్య గొంత కోసిన భర్త

    • కుషాయిగూడలోని పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో ఘటన...

    • బంధువుల ఇంట్లో భార్యను హత్య చేసిన భర్త...

    • మృతురాలు మహారాష్ట్ర ముంబై వాసిగా గుర్తింపు..

    • భార్యను హత్య చేసి పరారైన భర్త..

    • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు.

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

  • Sep 20, 2025 09:18 IST

    ఢిల్లీలోని పలు స్కూల్స్‌కి బాంబు బెదిరింపు

    • డీపీఎస్ ద్వారక, కృష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయ స్కూల్‌కి బాంబు బెదిరింపు

    • స్కూల్స్‌కి చేరుకుని తనిఖీలు నిర్వహించిన పోలీసులు

    • టీచర్లను, విద్యార్థులను స్కూల్ నుంచి బయటికి పంపించిన అధికారులు

    • విచారణ చేపట్టిన పోలీసులు

  • Sep 20, 2025 09:08 IST

    శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు..

    • 135 నాన్ డ్యూటీ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు.

    • గోవా, హర్యానా ,ఉత్తరప్రదేశ్, లక్నో పలు ప్రాంతాల నుండి హైదరాబాద్‌కి తీసుకువచ్చినట్టు గుర్తింపు

    • దసరా సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు మద్యాన్ని తీసుకొస్తున్న ముఠాలు

    • అక్రమంగా మద్యం తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసుల హెచ్చరిక

  • Sep 20, 2025 07:16 IST

    రాయచోటిలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి..

    • రాయచోటిలో శుక్రవారం రాత్రి దంచికొట్టిన వర్షం..

    • డ్రైనేజీ కాలువలో పడి కొట్టుకుపోయిన తల్లీబిడ్డ..

    • ఎస్‌ఎన్ కాలనీ అంగన్‌వాడీ వెనుక వైపు డ్రైనేజీ కాలువ వరద నీటిలో కొట్టుకుపోయిన తల్లీబిడ్డ

    • తల్లీబిడ్డను కాపాడబోయి వరద నీటిలో కొట్టుకు పోయిన 25 సంవత్సరాల యువకుడు..

    • చివరకు గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద మూడు మృతదేహాలు లభ్యం..

    • సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.

  • Sep 20, 2025 07:12 IST

    నేడు మాచర్ల లో సీఎం చంద్రబాబు పర్యటన..

    • చెరువు పరిసరాల్లో స్వచ్చతా కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

    • మాచర్ల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్న చంద్రబాబు.

    • సీఎం పర్యటనకు భారీ స్వాగతం ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే జూలకంటి