CII Partnership Summit: సీఐఐ సమ్మిట్ .. ఏపీకి దిగ్గజ సంస్థలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:04 AM
విశాఖపట్నంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి.
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, ఆ సంస్థ కార్పొరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, ఏపీ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. రూ.1201 కోట్ల పెట్టుబడులతో ఏపీలో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్.
సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ను ఏర్పాటు చేస్తోంది రేమాండ్ గ్రూప్. అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్. అనంతపురం జిల్లా టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్. మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది రేమాండ్ సంస్థ.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
ఆర్ఐ సతీష్ కుమార్ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ
Read Latest AP News And Telugu News