Share News

MP Arvind: ఆ విషయంలో హిందువులను విస్మరించిన కాంగ్రెస్

ABN , Publish Date - Mar 15 , 2024 | 04:15 PM

నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కమిటీలకే పరిమితమైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు.

MP Arvind:  ఆ విషయంలో హిందువులను విస్మరించిన కాంగ్రెస్

నిజామాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కమిటీలకే పరిమితమైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక.. 66ఫ్యాక్టరీలను తెరిపించారని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తుశుధ్ది లేదని అన్నారు. జగిత్యాల మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల‌ కోసం హిందువులను కాంగ్రెస్ విస్మరించిందని ధ్వజమెత్తారు. సీఏఏపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఈ నెల18వ తేదీన జగిత్యాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

TG Politics: సీఎం రేవంత్ అందులో పోటీ పడుతున్నారు: హరీశ్‌రావు

Big Breaking: ఎన్నికల ముందు ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఝలక్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 04:17 PM