Share News

Big Breaking: ఎన్నికల ముందు ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఝలక్..

ABN , Publish Date - Mar 15 , 2024 | 03:05 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇంటిపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు చేస్తోంది...

Big Breaking: ఎన్నికల ముందు ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఝలక్..

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇంటిపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు చేస్తోంది. ఐటీ, ఈడీ అధికారులతో కలిసి జాయింట్‌గా.. మొత్తం నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనీఖీలు చేస్తున్నారు. మరోవైపు కవిత నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు.. పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ సోదాలతో బీఆర్ఎస్‌లో ఒకింత ఆందోళన మొదలైంది. కాగా.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత నిందితురాలు ఉన్న విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినప్పటికీ ఈ మధ్య హాజరుకాలేదు.


ED-Raids.jpg

ఏం జరుగుతోంది..?

గత పదేళ్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరిస్తున్నది. కవిత, ఆమె సహాయకుల సెల్‌ఫోన్స్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. తనపై చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలన్న కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ గ్యాప్‌లోనే కవిత ఇంటిపై ఐటీ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు జాయింట్ సోదాలు చేయడం గమనార్హం.

Updated Date - Mar 15 , 2024 | 04:10 PM