Share News

Tamilisai: వారి కోసమే గవర్నర్‌ పదవిని వదిలేశా..

ABN , Publish Date - May 04 , 2024 | 05:00 PM

Telangana: కేవలం కుటుంబ సభ్యుల బాగు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునేది బీజేపీ మాత్రమే అని మాజీ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు తమిళ సై హాజరై ప్రసంగించారు.

Tamilisai: వారి కోసమే గవర్నర్‌ పదవిని వదిలేశా..
Former Governor Tamilisai Soundararajan

సంగారెడ్డి, మే 4: కేవలం కుటుంబ సభ్యుల బాగు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ (Congress) అని.. దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునేది బీజేపీ (BJP) మాత్రమే అని మాజీ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ (Former Governor Tamilisai Soundararajan) అన్నారు. శనివారం సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు తమిళ సై హాజరై ప్రసంగించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) కుటుంబం దేశానికి చేసింది ఏమీ లేదన్నారు.

AP Elections: ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌పై అలా ఊగుతూ మాట్లాడటమేంటి?.. పవన్‌పై బొత్స ఫైర్


అస్సలు ఆయనకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. 70 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అభివృద్ధి కేవలం మోదీతోనే సాధ్యమని.. అందుకే దేశ ప్రజలు మోదీని కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అని... బీఆర్‌ఎస్‌తో అస్సలు కాదన్నారు. ఏ పార్టీకి ఓటు వేసిన గెలిచేది మాత్రం మోదీనే అని తమిళ సై ధీమా వ్యక్తం చేశారు.


గవర్నర్ పదవిపై ఇలా..

‘‘చాలా మంది మీరు గవర్నర్ పదవికి ఎందుకు వదిలేశారు అడిగిన వారికి ఒక్కటే చెపుతున్న ... ప్రజలతో ఉండటానికి ప్రజల కోసం పని చేయడానికి, ప్రత్యక్షంగా ప్రజలతో ఉండాలని అంతేకాక తెలంగాణ ప్రజలు అందరి నన్ను సోదరిగా స్వీకరించారు. ఆ ప్రేమ కోసం గవర్నర్ పదవిని కూడా వదిలేశా’’ అని తమిళ సై సౌందర్ రాజన్ వివరించారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ఎక్కడికెళ్లినా, ఎటు చూసినా జనం.. అయినా వైఎస్ జగన్‌ను వెంటాడుతున్న భయం!!

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. నేటి నుంచి బంద్!!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 05:00 PM