Share News

Bhatti Vikramarka: కార్పొరేట్‌ కోసమే బీజేపీ పనిచేస్తోంది

ABN , Publish Date - May 24 , 2024 | 04:50 AM

దేశ ప్రజల కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుంటే.. బహుళ జాతి కంపెనీల కోసమే బీజేపీ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దేశ వనరులు, సంపద ప్రజలకే చెందాలని తమ నాయకులు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ పోరాడుతుంటే..

Bhatti Vikramarka: కార్పొరేట్‌ కోసమే బీజేపీ పనిచేస్తోంది

  • రిజర్వేషన్లు ఎత్తేసేందుకూ కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుంటే.. బహుళ జాతి కంపెనీల కోసమే బీజేపీ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దేశ వనరులు, సంపద ప్రజలకే చెందాలని తమ నాయకులు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ పోరాడుతుంటే.. దేశంలోని ఆస్తులు, వ్యవస్థలను అమ్మి కొన్ని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు.


బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి అమర్జిత్‌ కౌర్‌కు మద్దతుగా ప్రచార సభల్లో భట్టి ప్రసంగించారు. ‘భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు ఉండాలని, ప్రజలకు సంపదను పంచాలని రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు. కానీ అధికార బీజేపీ ఓబీసీ, బీసీ, ఎస్సీల రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోంది.’ అని ఆరోపించారు.

Updated Date - May 24 , 2024 | 04:50 AM