Share News

Telangana: అదుపుతప్పి బోల్తా పడిన కారు.. ఒకరు మృతి..

ABN , Publish Date - Jan 14 , 2024 | 07:38 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుస్నాబాద్ - కరీంనగర్ రోడ్ లో అతి వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది.

Telangana: అదుపుతప్పి బోల్తా పడిన కారు.. ఒకరు మృతి..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుస్నాబాద్ - కరీంనగర్ రోడ్ లో అతి వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యశ్వంత్, అజయ్, వెంకటేశ్, అఖిల్ కలిసి కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సహాయకచర్యలు ప్రారంభించి.. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

Updated Date - Jan 14 , 2024 | 07:38 PM