Share News

Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితను హాజరుపర్చిన ఈడీ.. వాదనలు ఇవే

ABN , Publish Date - Mar 23 , 2024 | 01:16 PM

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటి ముగిసింది. దీంతో కాసేపటి క్రితమే కవితను ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.

Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితను హాజరుపర్చిన ఈడీ.. వాదనలు ఇవే

న్యూఢిల్లీ , మార్చి 23: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఈడీ (ED) కస్టడీ నేటి ముగిసింది. దీంతో కాసేపటి క్రితమే కవితను ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో (Delhi Rouse Avenue Court )ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. నలుగురు స్టేట్మెంట్‌ను కవితని అడిగామని.. కిక్ బ్యాగ్స్ గురించి కూడా అడిగినట్లు తెలిపారు. అయితే విచారణకు కవిత సహకరించడం లేదన్నారు. సమీర్ మహేంద్రతో కలిసి కవితను ప్రశ్నించాలని.. లిక్క్ స్కామ్‌లో రూ. కోట్లలో కిక్ బ్యాక్‌లు అందాయన్నారు. సౌత్ గ్రూప్‌కు రూ.100 కోట్లు చేరాయని తెలిపారు.

Kavitha: ఆరోగ్య పరిస్థితిపై కోర్టులో కవిత పిటిషన్.. ఇంతకీ ఏమైంది?


కవిత మొబైల్ డేటాను విశ్లేషించామని.. అయితే ఫోన్‌లోని డేటాను తొలగించారన్నారు. కవిత కుటుంబ సభ్యులు వివారాలు ఇవ్వడం లేదని తెలిపారు. కవిత మేనల్లుడి వ్యాపారానికి సంబంధించి వివరాలు అడిగామని.. తనకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చారన్నారు. సోదాల్లో కవిత మేనల్లుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని.. అప్పటి నుంచి మేనల్లుడు కనిపించడం లేదని ఈడీ తరపు న్యాయవాది వెల్లడించారు. మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామని.. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. రేఖా శరణ్‌కు సంబంధించి సమాచారం ఇవ్వడంలేదని చెప్పారు. సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీ అని.. ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

Chandrababu: యుద్ధంలో గెలిచి తీరాలి.. శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం..

వివరాలు ఎలా ఇస్తారు?: కవిత న్యాయవాది


అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవితను బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఐటీ అడుగుతున్నారని.. కస్టడీలో ఉన్నప్పుడు డాక్యుమెంట్ వివరాలు ఎలా ఇస్తారని కవిత తరపు న్యాయవాది వాదించారు. కవిత తరపున బెయిల్ పిటిషన్ వేశామని.. బెయిల్ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం బెయిల్‌కు విచారణ అర్హత లేదని ఈడీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

MLC Kavitha: తప్పుడు కేసు పెట్టారు.. న్యాయపరంగా పోరాడుతా: ఎమ్మెల్సీ కవిత

Chandrababu: విశాఖ డ్రగ్స్‌ కేసులో ఉన్నది వైసీపీ నేతలే.. ఆధారాలతో బయటపెట్టిన చంద్రబాబు!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 23 , 2024 | 01:35 PM