Share News

Congress: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:36 AM

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది.

Congress: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

ఢిల్లీ: లోక్‌సభ (Loksabha) అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ (Congress) కసరత్తు నిర్వహిస్తోంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది. సీఈసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjuna Kharge), పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), జైరాం రమేష్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు.

కాంగ్రెస్ సీఈసీలో తెలంగాణ, కేరళ, కర్ణాటక, హర్యానా, చత్తీస్ ఘడ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఈసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పాల్గొననున్నారు. జహీరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, చేవెళ్ల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 10:37 AM