Home » Bhatti Vikramarka
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల నెలవారీ డైట్, కాస్మెటిక్ చార్జీలు పెరగనున్నాయి. ఇవి దాదాపు 40 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు భట్టి విక్రమార్క.. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వడ్డీలు/అసలుకే ఇప్పటిదాకా రూ.56,440కోట్లు కట్టామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
గత కొన్ని సీజన్లుగా బియ్యం బకాయిలున్న రైస్మిల్లర్లకు వానాకాలం సీజన్లో ధాన్యం ఇవ్వకూడదని ధాన్యం సేకరణ పాలసీ- 2024పై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది.
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించుకుని వచ్చే ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శులతో మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ మంత్రులను పార్టీ తరఫున సీనియర్ పరిశీలకులుగా కాంగ్రెస్ నియమించింది.
సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు.
చిన్నతనంలో తన స్వగ్రామమైన లక్ష్మీపురం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి చదువుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ప్రాతినిధ్యం వహించడం మన రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.