Home » Bhatti Vikramarka
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డును యథావిధిగా ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం 18 గంటలు పనిచేస్తుంటే... బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఏదో ఒక అభాండం వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సన్నబియ్యం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
దేశ రాజధానిలో 'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0' జాతీయ సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపేలా కేంద్రం చొరవ చూపాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల దాదాపు 4 వేల మంది మరణించారని ఉపముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. నాయకులను బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్లో చేర్చుకున్నారని అన్నారు.
మానవీయ కోణంలో ఆలోచించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతో జీవిత భీమా తీసుకువచ్చామని తెలిపారు.
తెలంగాణ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆరు గ్యారంటీల అమలుకు మొత్తం రూ.50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణ శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.