TS Politics: సీఎం రేవంత్రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
ABN , Publish Date - Jan 17 , 2024 | 08:15 PM
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay ) బుధవారం బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు.
![TS Politics: సీఎం రేవంత్రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ](https://media.andhrajyothy.com/media/2023/20231205/BANDI_SANJAY_CM_REVANTH_ee799c9624.jpg)
కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay ) బుధవారం బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉత్పత్తి వ్యయం పెరగడం, గిట్టుబాటు ధర, సరైన మార్కెట్ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్ పెట్టారని వెల్లడించారు. సిరిసిల్ల సంక్షోభానికి ప్రధాన కారణం బీఆర్ఎస్సేనని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు కూడా కారణమేనని తెలిపారు. ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోందన్నారు. బతుకమ్మ చీరల బకాయిల సొమ్ము రూ.220 కోట్లను ప్రభుత్వం చెల్లించకపోవడంవల్లే ఈ దుస్థితి నెలకొందని బండి సంజయ్ అన్నారు.