Share News

Telangana: మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి: హరీష్ రావు

ABN , Publish Date - May 04 , 2024 | 08:52 PM

మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి(Congress Party) పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) ప్రజలు బుద్ది చెప్పాలని బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు హరీష్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లా(Siddipet) అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో వెంకట్రామిరెడ్డికి(Venkata Ram Reddy) మద్ధతుగా ప్రచారం నిర్వహించారు.

Telangana: మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి: హరీష్ రావు
Harish Rao

మెదక్, మే 04: మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి(Congress Party) పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) ప్రజలు బుద్ది చెప్పాలని బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు హరీష్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లా(Siddipet) అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో వెంకట్రామిరెడ్డికి(Venkata Ram Reddy) మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించిన హరీష్ రావు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

దేవుళ్ల మీద ఒట్టు పెట్టి కాంగ్రెస్ వాళ్లు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. వెంకట్రామిరెడ్డి విద్యావంతుడు, తెలివైన వాడు అని, ఆయన్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రఘునందన్ రావు ఎలాంటి వ్యక్తో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఉప ఎన్నికల సమయంలో తాను నిజాలు చెబితే.. రఘునందన్ రావు అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో 54 వేల మెజార్టీతో రఘునందన్‌ను ఓడించారని హరీష్ రావు పేర్కొన్నారు.


కాంగ్రెస్‌ది మోసాల పాలన..

కాంగ్రెస్ పార్టీ మోసాలతో పరిపాలన సాగిస్తోందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడిచినా రూ. 2 లక్షల రుణాలు మాఫీ కాలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక నెలాఖరు వరకు ఫెన్షన్ డబ్బులు పడటం లేదని విమర్శించారు. బంగారం ధర రూ. 25వేలు పెరిగిందన్నారు. కాంగ్రెస్ నేతలవన్నీ అబద్దాలు, మోసాలేనని హరీష్ రావు దుయ్యబట్టారు. అబద్ధాల ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు హరీష్ రావు. మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 04 , 2024 | 08:52 PM