‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్ ఆవిష్కరణ
ABN, Publish Date - Sep 19 , 2024 | 11:18 AM
అమరావతి: నూతన ప్రభుత్వాలు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా.. ఈ వంద రోజుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించే విధంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోస్టర్ను ఆవిష్కరించారు. ఆరు రోజులపాటు ప్రతి గడపకు వెళ్లే కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పని చేస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా రెండు ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నేతలకు సూచించారు.
1/11
‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.
2/11
స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పగుచ్చములుంచి నివాళులర్పిస్తు్న్న సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
3/11
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చములిచ్చి అభినందనలు తెలుపుతున్న టీడీపీ నేతలు..
4/11
సీఎం చంద్రబాబు నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు..
5/11
‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కూటమి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు..
6/11
సీఎం చంద్రబాబు నిర్వహించిన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన కూటమి నేతలు..
7/11
ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో కూటమి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
8/11
ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో కూటమి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
9/11
100 రోజుల ఎన్డీయే పాలనపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్..
10/11
ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో కూటమి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి..
11/11
ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముచ్చటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి..
Updated at - Sep 19 , 2024 | 11:18 AM