Home » Purandeswari
కడప జిల్లాలో పెట్రోల్ పోసి హత్య చేసిన దోషిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విద్యార్థిని హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు.
సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు సీఎం చంద్రబాబు తెలియజెప్పి ఉంటారని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పుమట్టారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు.సనాతన ధర్మాన్ని నిర్మూలించే వరకు విశ్రమించమని చెప్పిన ఉదయనిధి స్టాలిన్ పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతుందని ఆరోపించారు.
Andhrapradesh: జమిలి ఎన్నికలపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు అని స్పష్టం చేశారు.
Andhrapradesh: వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుద్ద్య కార్మికులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సన్మానించారు. వరద అనంతరం ప్రాంతాలను క్లీన్ చేయడంలో కార్మికుల కృషి చెప్పలేనిదంటూ వారికి వస్త్రాలను అందజేశారు. అనంతరం పురేందేశ్వరి మాట్లాడుతూ... విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని, అందుకే ప్రజలు ముడోసారి మోదీని ప్రధానిని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రామమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి పేదల పక్షాన నిలుస్తుంది కాబట్టే మూడోసారి తమ పార్టీకి పట్టం కట్టారని ఆమె చెప్పారు.
ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పినా వైసీపీలో ఇంకా మార్పు రావడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. ఈ ఘోర ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోందన్నారు. వైసీపీ అరాచక పాలనను దించడానికి ప్రజలు కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు.
Andhrapradesh: నగరంలో బీజేపీ సభత్వ నమోదు కార్యక్రమం బుధవారం ఉదయం ప్రారంభమైంది. సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశాన్ని ఏపీ బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మన బాధ్యత అని.. లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
‘ప్రజలే దేవుళ్లన్న ఎన్టీ రామారావు, జనతా జనార్దన్ అన్న నరేంద్ర మోదీ.. వ్యాఖ్యల స్ఫూర్తితో ప్రజలకు సేవకులమై వారి కన్నీరు తుడుస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
ప్రపంచ దేశాలు భారతదేశం వైపు నేడు చూస్తున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నాడు జరిపారు. జాతీయ పతాకాన్ని పురందేశ్వరి ఎగుర వేశారు.