Share News

Kejriwal: కేజ్రీవాల్ కు సమన్లు.. సమాధానం చెప్పాలంటూ ఈడీకి కోర్టు ఆదేశాలు..

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:43 PM

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

Kejriwal: కేజ్రీవాల్ కు సమన్లు.. సమాధానం చెప్పాలంటూ ఈడీకి కోర్టు ఆదేశాలు..
Delhi Liquor Scam Case

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రమ్‌ చౌదరిలు వాదించారు. పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ సమర్పించిన సమన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం సమన్లపై సమాధానం చెప్పాలంటూ ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది.

కాగా.. మార్చి 21న విచారణకు హాజరుకావాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. సమన్ల దాటవేతపై ఈడీ కేసు నమోదు చేసింది. పాలసీ రూపకల్పన, ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు, లంచం తీసుకున్నారనే ఆరోపణలు సహా పలు అంశాలపై ఈ కేసులో ఆప్ చీఫ్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరుతోంది. దీనిపై కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ఈడీ సమాధానం చెప్పాలని కోరింది.


దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో కేజ్రీవాల్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఎక్సైజ్ పాలసీని రూపొందించిన వారు కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నారని, ఫలితంగా తమకు అనవసరమైన ప్రయోజనాలు చేకూర్చాయని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 01:00 PM