Home » AAP
పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పంజాబ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రవేశపెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' నుంచి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించడంతో ఆప్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారంనాడు కోరింది. ఈ మేరకు సీపీ రాధాకృష్ణన్కు ఆప్ సీనియర్ నేత సంజయ్సింగ్ వినతిపత్రం సమర్పించారు.
శీష్ మహల్ (అద్దాల మేడ) కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి అదే ప్రధాన కారణమని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలలో రాఘవ్ చద్దా ఒకరు.
లోధి ఎస్టేట్ ప్రభుత్వ బంగ్లాలోకి ఇటీవల మారిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై మరోసారి బీజేపీ విమర్శలు గుప్పించింది. తన అధికారిక నివాసాన్ని ప్రైవేటు మనీతో లగ్జరీ ఇల్లుగా మార్చుకున్నారని, రెండో శీష్ మహల్ నిర్మించుకున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఎంపీలు పార్టీకి ఉద్వాసన చెప్పి బీజేపీలో చేరడం రాజకీయంగా సంచలనమైంది. వీరిపై తక్షణ చర్యలకు కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' కసరత్తు చేస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఎంపీ స్వాతి మాలివాల్.. కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశారు. తాను 2006 నుంచి కేజ్రీవాల్, ఆయన పార్టీతో కలిసి పనిచేస్తున్నానని, అన్ని ఉద్యమాల్లోనూ చురుకుగా పాల్గొన్నానని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాఘవ్ చద్దా రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరనున్నట్లు చద్దా తెలిపారు.
ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా తన పట్ల పార్టీ ప్రదర్శిస్తోన్న వైఖరిని తప్పుబట్టారు. నా నోరు నొక్కినంత మాత్రాన, మీరు గెలిచినట్టుకాదంటూ సొంతపార్టీకి సూచించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయగలరేమో గానీ.. ఓడించలేరన్నారు.