Home » AAP
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఎంసీడీ ఉప ఎన్నికలు రావడంతో ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు ఇది పరీక్షగా అందరూ భావించారు. అయితే ఆమె సునాయాసంగా ఈ పరీక్షలో నెగ్గారు.
ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, తాజాగా ఎంసీడీలోని 12 వార్డులకు ఉపఎన్నికలు జరగడంతో ప్రజలు ఏపార్టీని ఆదరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
హర్మీత్ సింగ్ సంధుకు తరన్ తారన్లో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయినప్పటికీ ఆయన 68,235 ఓట్లు దక్కించుకుని గెలుపును సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కరణ్బీర్ సింగ్ బుర్జ్ 22,473 ఓట్లు, సాద్ అభ్యర్థి సుఖ్వీందర్ కౌర్ 7,158 ఓట్లు, బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధు 3,042 ఓట్లు సాధించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి బిహార్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు.
కేజ్రీవాల్ పోస్ట్ను బీజేపీ వెంటనే తప్పుపట్టింది. ఎడిట్ చేసిన వీడియోతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమంటూ మండిపడింది. రేఖా గుప్తా ఇంటర్వ్యూ పూర్తి వీడియోను కూడా విడుదల చేసింది.
ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా సంచలనం సృష్టించారు. అత్యాచార ఆరోపణలపై అరెస్టయిన హర్మీత్.. అనూహ్యంగా పోలీసు కస్టడీ నుంచి పరారయ్యాడు. హరియాణాలోని కర్నాల్లో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు.
పంజాబ్ గాయనిగా పేరుతెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన 35 ఏళ్ల మాన్ 2022లో ఖరార్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మంత్రిగా కీలక శాఖల్లో పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కలేదు. అనూహ్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం నాడు ప్రకటించారు.
బరువెక్కిన హృదయంతో రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మాన్ తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని కోరారు. పార్టీకి బెస్ట్ విషెస్ తెలిపారు.
ఇండియా కూటమి కింద 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని, అయితే ఆ తర్వాత జరిగిన హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలో సోలోగానే ఎన్నికల్లోకి దిగాయని సంజయ్ సింగ్ చెప్పారు.