Share News

Lok Sabha Elections: తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్.. యూపీలో ఈక్వేషన్స్ ఇవే..

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:20 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల పరిధిలో 102 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈశాన్య భారతంలోని ఆరు రాష్ట్రాల్లో 9 లోక్‌సభ స్థానాలతో పాటు.. తమిళనాడులోని 39 స్థానాలు, లక్షద్వీప్‌లోని ఒక లోక్‌సభ స్థానంలో మొదటి దశలో పోలింగ్ జరగనుంది.

Lok Sabha Elections: తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్.. యూపీలో ఈక్వేషన్స్ ఇవే..

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల పరిధిలో 102 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈశాన్య భారతంలోని ఆరు రాష్ట్రాల్లో 9 లోక్‌సభ స్థానాలతో పాటు.. తమిళనాడులోని 39 స్థానాలు, లక్షద్వీప్‌లోని ఒక లోక్‌సభ స్థానంలో మొదటి దశలో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 21 రాష్ట్రాల్లోని 102 స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీహార్‌లో స్థానిక పండుగ దృష్ట్యా మార్చి 28 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

తొలి దశలో..

తొలి దశలో అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు, బీహార్‌లో నాలుగు, అస్సాంలోని నాలుగు, ఛత్తీస్ గఢ్ నుంచి ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఆరు, మహారాష్ట్రలో ఐదు, మణిపూర్‌లో రెండు, మేఘాలయలో రెండు, మిజోరాంలో ఒక స్థానానికి తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్‌లో ఒకటి, రాజస్థాన్‌లో 12, సిక్కింలో ఒకటి, త్రిపురలో ఒకటి, తమిళనాడులో 39, ఉత్తరప్రదేశ్‌లో 8, ఉత్తరాఖండ్‌లో 5, పశ్చిమ బెంగాల్‌లో 3, అండమాన్ నికోబార్‌లో 1, జమ్మూ కాశ్మీర్‌లో 1, లక్షద్వీప్‌లో 1 పుదుచ్చేరిలో 1 లోక్‌సభ స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయి.

Lok Sabha Elections: యూపీలో కాంగ్రెస్ ప్రభావం ఎంత.. పొత్తు కలిసొస్తుందా..?

యూపీలో రాజకీయ సమీకరణాలు

తొలిదశలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో 8 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ యుపిలోని సహరాన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఎనిమిది స్థానాల్లో మూడు చోట్ల బీజేపీ, మూడు చోట్ల బీఎస్పీ, రెండు స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డి పొత్తులో ఉండగా.. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎస్పీ కాంగ్రెస్‌తో కలిసి ఇండియా కూటమిలో ఉండగా.. ఆర్‌ఎల్‌డీ బీజేపీతో జట్టు కట్టింది. బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. దీంతో ఈసారి యూపీలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. తొలి దశలో ఎనిమిది స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించగా, ఎస్పీ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీఎస్పీ ఐదు స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మొదటి దశలో 8 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 1.43 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 76.23 లక్షల మంది పురుష ఓటర్లు, 67.14 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 824 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Congress: పోటీకి సోనియా, రాహుల్ దూరం.. బరేలి అమేథి కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 12:23 PM