Share News

Lok Sabha Elections: యూపీలో కాంగ్రెస్ ప్రభావం ఎంత.. పొత్తు కలిసొస్తుందా..?

ABN , Publish Date - Mar 19 , 2024 | 01:15 PM

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారానికి దగ్గరగా ఉంటుంది. దీంతో ఉత్తరప్రదేశ్‌పై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది.

Lok Sabha Elections: యూపీలో కాంగ్రెస్ ప్రభావం ఎంత.. పొత్తు కలిసొస్తుందా..?

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారానికి దగ్గరగా ఉంటుంది. దీంతో ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)పై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లలో గెలుపొందగా, బీఎస్పీ 10 స్థానాలను దక్కించుకుంది. ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ ఒకేఒక స్థానంలో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ ఇండియా (INDIA) కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. 80 సీట్లలో ఎస్పీ 63, కాంగ్రెస్ 17 స్థానాలను షేర్ చేసుకున్నాయి. ఎస్పీ తన కోటా నుంచి ఒక సీటును తృణమూల్ కాంగ్రెస్‌కు కేటాయించింది. గత ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితమైన కాంగ్రెస్ ఈ సారి ఎలాంటి ప్రభావం చూపించబోతుందనేది ఆసక్తి రేపుతోంది.

2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియాగాంధీ ఎంపీగా గెలిచారు. అమేథి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఈరెండు స్థానాలు పొత్తులో కాంగ్రెస్‌కు దక్కాయి. గాంధీ కుటుంబానికి మంచి పట్టున్న రెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎవరిని నిలబెడతరానేది ఆసక్తి కలిగిస్తోంది. 17 సీట్లలో పోటీచేయాలనే విషయంలో కాంగ్రెస్‌కు స్పష్టత ఉంది. కాని సీట్ల కేటాయింపు

జరిగిన తరువాత నుంచి అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. 25 సంవత్సరాలుగా రాయబరేలీ నుంచి ఎంపీగా గెలుస్తూ వస్తున్న సోనియా గాంధీ.. ఈసారి ఎన్నికల బరిలో దిగడంలేదు. దీంతో హస్తం పార్టీ ఒక సీటు అయినా గెలుస్తుందా అనే చర్చ మొదలైంది. సీట్ల పంపకంలో రాయ్ బరేలీ, అమేథీ, కాన్పూర్, ఫతేపూర్ సిక్రీ, బన్స్‌గావ్, ఝాన్సీ, సీతాపూర్, సహరాన్‌పూర్, ప్రయాగ్‌రాజ్, మహరాజ్‌గంజ్, వారణాసి, అమ్రోహా, బుల్దాన్‌షహర్, ఘజియాబాద్, మధుర, బారాబంకి, డియోరియా సీట్లు కాంగ్రెస్‌కు దక్కాయి. ఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నా.. వీటిలో ఏ స్థానంలో కాంగ్రెస్ గెలుస్తుందని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉందట.

ఖాతా తెరుస్తుందా..

కాంగ్రెస్ ప్రస్తుతం పోటీ చేయనున్న 17 స్థానాల్లో రాయ్‌బరేలీలో మాత్రమే 2019 ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. సోనియాగాంధీ ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నికవ్వడంతో.. ఈ ఎన్నికల్లో పోటీ చేయరనేది సుస్పష్టం. సోనియా గాంధీ పోటీచేస్తే మూపీలో కాంగ్రెస్ మళ్లీ ఆ స్థానంలో గెలిచే అవకాశం ఉందని అంతా భావించారు. కాని సోనియా పోటీకి దూరంగా ఉంటుండటంతో ఇక్కడ కాంగ్రెస్ విజయం కష్టమేననే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో పొత్తు కాంగ్రెస్‌కు ఏ మేరకు కలిసి వస్తుంది.. కాంగ్రెస్ ప్రభావం యూపీలో ఎంతో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి మరి.

మరిన్ని జాతీయ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 01:15 PM