Share News

Kangana Ranaut: నేను గొడ్డు మాంసం తినను.. కాంగ్రెస్ నేతకు కంగనా స్ట్రాంగ్ కౌంటర్..

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:21 PM

హిమాచల్ ప్రదేశ్‌లో లోక్ సభ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. మండి లోక్‌సభ ( Lok Sabha Elections 2024 ) స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున విజయ్ వాడెట్టివార్ పోటీలో ఉన్నారు.

Kangana Ranaut: నేను గొడ్డు మాంసం తినను.. కాంగ్రెస్ నేతకు కంగనా స్ట్రాంగ్ కౌంటర్..

హిమాచల్ ప్రదేశ్‌లో లోక్ సభ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. మండి లోక్‌సభ ( Lok Sabha Elections 2024 ) స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున విజయ్ వాడెట్టివార్ పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ పై కంగన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాను గొడ్డు మాంసం గానీ ఎలాంటి రెడ్ మీట్ వంటివి తిననని వెల్లడించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దశాబ్దాలుగా తాను యోగా, ఆయుర్వేద విధానాన్ని పాటిస్తున్నానన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నరాని ఆక్షేపించారు. తాను గర్వించదగిన హిందువుననే విషయం ప్రజలందరికీ తెలిసిందేనని స్పష్టం చేశారు.


తాను బీఫ్ తింటానని కంగనా రనౌత్ ఇటీవల చెప్పారని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఆరోపించారు. గొడ్డు మాంసం ఇష్టమని ఎక్స్‌లో రాసిన కంగనా రనౌత్‌కు బిజెపి టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. వాడెట్టివార్ వ్యాఖ్యపై బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం మాని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 08 , 2024 | 01:22 PM