Share News

Kejriwal: కంప్యూటర్, కాగితాలు ఎలా అందాయి.. జైలు నుంచే ఆర్డర్స్ ఇష్యూపై ఈడీ చర్యలు..

ABN , Publish Date - Mar 26 , 2024 | 09:32 AM

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.

Kejriwal: కంప్యూటర్, కాగితాలు ఎలా అందాయి.. జైలు నుంచే ఆర్డర్స్ ఇష్యూపై ఈడీ చర్యలు..

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు. ఈ పరిణామాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తీవ్రంగా తప్పుబట్టింది. కస్టడి సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని వెల్లడించింది. అవి ఎలా లోపలికి వచ్చాయో, ఆదేశాలు ఎలా బయటకు వచ్చాయి అనే విషయంపై సమాచారం తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆప్‌ మంత్రి ఆతిశీని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

BJP vs Congress: వాయనాడ్ లోనూ అమేథీ పరిస్థితే.. రాహుల్ పై బీజేపీ సంచలన కామెంట్స్..

ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీలో నుంచే తొలి ఆదేశం జారీ చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించాలని జల వనరుల శాఖ మంత్రి ఆతిశికి ఆదేశాలు జారీ చేశారు. తనకు ఆ ఉత్తర్వు శనివారం అందిండని అతిశి వెల్లడించారు. తాను కష్టాల్లో ఉన్నప్పటికీ దిల్లీ ప్రజల పట్ల కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తుండడం తనకు కన్నీళ్లు తెప్పించిందనివాపోయారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 09:32 AM