Home » Arvind Kejriwal
ఢిల్లీ 'శీష్ మహల్'ను ఖాళీ చేసిన తర్వాత పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతున్న కేజ్రీవాల్కు అంతకంటే ఖరీదైన, విశాలమైన శీష్ మహల్ను ఛండీగఢ్లోని సెక్టార్-2లో నిర్మించారని బీజేపీ తెలిపింది.
కేజ్రీవాల్ 2024 సెప్టెంబర్ 17న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 4న ఫ్లాగ్స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాను ఖాళీ చేసి ఆప్ పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్నారు. బంగ్లా కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
కేజ్రీవాల్ పోస్ట్ను బీజేపీ వెంటనే తప్పుపట్టింది. ఎడిట్ చేసిన వీడియోతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమంటూ మండిపడింది. రేఖా గుప్తా ఇంటర్వ్యూ పూర్తి వీడియోను కూడా విడుదల చేసింది.
అమెరికా కాటన్ దిగుమతులపై 2025 డిసెంబర్ 31 వరకూ 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఈ చర్యతో స్థానిక రైతులు ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారని, అమెరికా రైతులు సంపన్నులు అవుతారని అన్నారు.
ప్రత్యర్థి పార్టీల్లోని ఫిరాయింపుదారులను బీజేపీలోకి తీసుకోవడాన్ని కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారేనని అన్నారు.
విపక్ష ఇండియా కూటమిలో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ..
బీహార్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అన్ని స్థానాలకు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ప్రకటన చేశారు.
నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా, వీటిలో రెండు స్థానాలను ఆప్ గెలుచుకుంది. గుజరాత్లో ఒక అసెంబ్లీ స్థానాన్ని, పంజాబ్లోని లూథియానా వెస్ట్ స్థానాన్ని ఆప్ తన ఖాతాలో వేసుకుంది.
కేజ్రీవాల్ పాస్పోర్ట్ 2018లో గడువు ముగిసిందని, దానిని పది సంవత్సరాల పాటు పునరుద్ధరణకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మే 29న కోర్టును ఆశ్రయించారు. అయితే, దీనిని సీఐబీ, ఐడీ వ్యతిరేకించాయి.
ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వేడుకలో పంజాబ్ సీఎం భగవంత్ మన్ యమాజో్షగా భాంగ్రా నృత్యంతో అలరించారు. కాగా, శుక్రవారం హర్షిత, సంభవ్ల వివాహం ఘనంగా జరిగింది.