Home » arvind kejriwal
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితల జ్యుడిషియల్ కస్టడీ జులై 31 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. తీహాడ్ జైల్లోనున్న వీరిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను తీహాడ్ జైలు ఉన్నతాధికారులు ఖండించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తాజాగా దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై సమగ్రమైన సమాధానం ఇవ్వాలంటూ సీబీఐకి హైకోర్టు మంగళవారంనాడు నోటీసులు ఇచ్చింది.
తాను ఈ 21 రోజల్లో ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయ లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల వేళ అన్ని పార్టీల తరఫున తాను ప్రచారం చేశానని చెప్పారు. ఈ ప్రచారంలో దేశాన్ని రక్షించాలని ప్రజలకు సూచించానన్నారు. ముందు దేశం ముఖ్యమని.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.
Lok Sabha Election Results: శనివారం సాయంత్రం విడుదలైన దాదాపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు(Exit Poll Results) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే(NDA) మెజార్టీని ఇచ్చాయి. దాదాపు 350కి పైగా సీట్లు గెలుస్తుందని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విపక్ష నేతలు కొట్టిపడేస్తున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్షా 'ఏఎన్ఐ' వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఇది రొటీన్ జడ్జిమెంట్ కాదని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్ర శేఖర్ తాజాగా మరో లేఖను రాశారు. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ మెడికల్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జైల్లో ఉండి కేజ్రీవాల్ చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తారని.. ప్రజలు ఎవరూ మోసపోరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరించరని లేఖలో సుఖేష్ పేర్కొన్నారు. జూన్ 4న ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన సమాధానం చెబుతారన్నారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. అరవింద్ కేజ్రీవాల్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను గోవా కోర్టు తిరస్కరించింది. 2017 గోవా ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు.