Share News

Brother Anil Kumar: న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం.. ఎవరికీ భయపడవద్దు..

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:18 PM

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సొంత కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తెలిసిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్ కుటుంబంలో కీలక మార్పులు జరిగాయి. జగన్, షర్మిల కుటుంబాలు వేరైపోయాయి. వైఎస్ వివేకా హత్య వీరిద్దరినీ విడదీయలేదు కానీ జగన్ వైఖరే కారణమని మాత్రం తెలుస్తోంది. ఇప్పుడు షర్మిలకు అండగా వైఎస్ వివేకా కుటుంబంతో పాటు బ్రదర్ అనిల్ కుమార్ కూడా రంగంలోకి దిగారు.

Brother Anil Kumar: న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం.. ఎవరికీ భయపడవద్దు..

కడప: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సొంత కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తెలిసిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్ కుటుంబంలో కీలక మార్పులు జరిగాయి. జగన్, షర్మిల కుటుంబాలు వేరైపోయాయి. వైఎస్ వివేకా హత్య వీరిద్దరినీ విడదీయలేదు కానీ జగన్ వైఖరే కారణమని మాత్రం తెలుస్తోంది. ఇప్పుడు షర్మిలకు అండగా వైఎస్ వివేకా కుటుంబంతో పాటు బ్రదర్ అనిల్ కుమార్ కూడా రంగంలోకి దిగారు. షర్మిలతో పాటు వివేకా కూతురు సునీతా రెడ్డి తరచూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక బ్రదర్ అనిల్ కుమార్ ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

AP Elections: వైసీపీ చివరి అస్త్రం ఇదే.. పైసలపైనే జగనన్న నమ్మకం..


కడపలో నేడు బ్రదర్ అనిల్ కుమార్ పర్యటిస్తున్నారు. కడప రాజారెడ్డి వీధిలోని కృపా చర్చిలో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చెమ్ము మియాపేటలో చర్చిలో కూడా అనిల్ ప్రార్థనలు చేశారు. కృపా చర్చిలో ఏసుప్రభు పాటలతో క్రైస్తవులను ఉత్సాహపరిచారు. రెండు గంటలపాటు చర్చిలో వాక్యం చదివారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని.. ఎవరికీ భయపడవద్దని.. ఏసుప్రభు అండగా ఉన్నాడని అనిల్ కుమార్ తెలిపారు. దేవుని పైన విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. పాపములు చేసిన వారిని తొక్కి పడేయాలన్నారు. పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన చేస్తే సరిపోదని.. ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.

ఇవి కూడా చదవండి..

Rain Alert: రోళ్లు పగిలే ఎండలో చల్లటి కబురు.. హైదరాబాద్‌ వాసులు ఊపిరి పీల్చుకోండి

Puzzle: ఈ ఫొటోలోనే తప్పేంటో 10 సెకెన్లలో పట్టుకోండి.. మీ పరిశీలనా శక్తి ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోండి!

Read Latest AP News AND Telugu News

Updated Date - Apr 29 , 2024 | 12:18 PM