Share News

TG Elections: కాంగ్రెస్ లో లీడర్లకు కొదవేం లేదు.. అందరూ తోపులే: జగ్గారెడ్డి

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:56 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని.. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లపై జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా తమకేం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నేతలు ఉండొచ్చు, బీజేపీలో ఇద్దరు ఉండొచ్చు.. కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు కొదవ లేదని స్పష్టం చేశారు.

TG Elections: కాంగ్రెస్ లో లీడర్లకు కొదవేం లేదు.. అందరూ తోపులే: జగ్గారెడ్డి
In A Congress Party All Are The Leaders

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని.. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లపై జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా తమకేం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నేతలు ఉండొచ్చు, బీజేపీలో ఇద్దరు ఉండొచ్చు.. కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు కొదవ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాండవులు అని, విజయం తమ వైపు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ కు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

Loksabha Elections: ఖమ్మం రోడ్‌ షోలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు


ఆగస్టు తర్వాత..?

కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని జగ్గారెడ్డి వివరించారు. అప్రమత్తంగా ఉన్నామని.. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఆగస్టులో సమాధానం ఉంటుందని తేల్చి చెప్పారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా.? లేదంటే వాళ్ల ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారనే అంశం తెలుస్తుందని చెప్పారు. కేసీఆర్ చెప్పే మాటలను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని వివరించారు.


అసలైన దేశభక్తులు

దేశభక్తులం అని బీజేపీ వారు డబ్బా కొట్టుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. అసలైన దేశభక్తులు రాహుల్ గాంధీ కుటుంబమేనని తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీకి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ వాళ్ళు మాత్రం డబ్బా కొట్టుకుంటారని వివరించారు. గ్రాఫిక్స్ హీరోలని మండిపడ్డారు.బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు.


అందరూ తోపులే

కాంగ్రెస్ పార్టీలో అందరూ తోపులేనని జగ్గారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో తోపు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రిలియంట్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ తోపులే. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం, శ్రీధర్ బాబు తోపులే. రేణుక చౌదరి, జీవన్ రెడ్డి, వీహెచ్ కూడా తోపులేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ లీడర్లే.. హైకమాండ్ మాటకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 19 , 2024 | 07:20 PM