Home » Jaggareddy
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ(గురువారం) ఢిల్లీలో కలిశారు. ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఈ విషయంపై మాట్లాడానని అన్నారు.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు అయ్యింది.
సంగారెడ్డి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రం దగ్గర చోటు చేసుకున్న ఉద్రికత్త కొత్త టర్న్ తీసుకుంది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి SEC ఆదేశాలిచ్చింది.
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సీఐ శివకుమార్.. బీఆర్ఎస్ రిగ్గింగ్ కు సహకరిస్తున్నారని మండిపడ్డారు.
దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన.. అని అన్నారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాష్రెడ్డి. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను సంగారెడ్డిలో ఓడిపోవడం చాలా బాధేసిందన్నారు.
సంగారెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అధికారంలో ఉన్నామని.. పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూడవద్దంటూ పార్టీ నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు పలికారు. ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి ఇబ్బంది పెట్టొద్దని కేడర్కు సూచించారు.
ప్రభుత్వపరంగా సీఎంలు, ఆశాఖ మంత్రులు చర్చించాల్సిన అంశాలపై తానేమీ మాట్లాడనని జగ్గారెడ్డి తెలిపారు. గతంలో జగన్, కేసీఆర్లు వీటిపై ఎప్పుడైనా చర్చలు చేశారా అని ప్రశ్నించారు.
సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. మోదీ హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి చర్చకు సిద్ధమా..? అని ఛాలెంజ్ చేశారు.