Share News

JP Nadda: కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:59 PM

కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామునికి సాష్టాంగ నమస్కారం తెలిపారు. మోదీ పాలనలోనే భారత్ శక్తి వంతంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం తప్పదన్నారు.

JP Nadda: కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామునికి సాష్టాంగ నమస్కారం తెలిపారు. మోదీ పాలనలోనే భారత్ శక్తి వంతంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం తప్పదన్నారు. గిరిజనుల అభివృద్ధి వికాసం మోదీ పాలన లోనే జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెచ్చుమీరిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన అసమర్థ పాలన అని జేపీ నడ్డా విమర్శించారు.

Rain Alert: రోళ్లు పగిలే ఎండలో చల్లటి కబురు.. హైదరాబాద్‌ వాసులు ఊపిరి పీల్చుకోండి


ఇండి కూటమిపై జేపీ నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ.. లాలు ప్రసాద్ యాదవ్.. డీఎంకే పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. కాంగ్రెస్ అంటేనే కుంభ కోణాల పార్టీ అని.. కుటుంబ పార్టీ అని విమర్శించారు. జన ప్రభంజనం చూస్తే ఖమ్మం గెలిచి తీరుతామన్నారు. అత్యంత కీలకమైన ఎన్నికల సమయం లో దేశ సమగ్రత కోరే ఒకే ఒక్క పార్టీ బీజేపీఅని అన్నారు. మోదీ సెక్యులర్ నేత అని.. ఆయన నాయకత్వంలో పని చేసే అవకాశం వినోద్ రావు, సీతారాం నాయక్‌లకు కల్పించాలని జేపీ నడ్డా అన్నారు. రామాలయ నిర్మాణం చేపట్టిన ఘనత, జమ్మూ కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిన నేత మోదీయేనన్నారు. దేశంలో 2జి తరహా అవినీతికి అడ్డుకట్ట వేసి, గత 10 సంవత్సరాల్లో అభివృద్ధికి బాటలు వేసిన సమర్ధ నాయకుడు మోదీ అని జేపీ నడ్డా కొనియాడారు.

ఇవి కూడా చదవండి...

Komatireddy Rajagopal Reddy: బీఆర్ఎస్ పాలనలో జోకర్ గాళ్లు, బ్రోకర్ గాళ్లెక్కువ...

Chandrababu: నేడు డోన్, నందికొట్కూరులో చంద్రబాబు ప్రజాగళం..

For more latest News and Telangana News


Updated Date - Apr 29 , 2024 | 01:59 PM