Share News

AP Politics: ‘అదంతా విష్ణు మాయ కాదు.. జగన్ మాయ’.. రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Mar 13 , 2024 | 04:49 PM

ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ(BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnu vardhan reddy) అంటున్నారని తెలిసిందన్నారు. అయితే, అది విష్ణువర్ధన్ రెడ్డి మాయ కాదని, వైఎస్ జగన్(YS Jagan) మాయ అని వ్యాఖ్యానించారు. విష్ణువర్ధన్‌ను ప్రయోగించింది జగనే అని ఆరోపించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణ రాజు(MP Raghu Rama Krishnam Raju).. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

AP Politics: ‘అదంతా విష్ణు మాయ కాదు.. జగన్ మాయ’.. రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..
MP Raghu Rama Krishnam Raju

పశ్చిమగోదావరి, మార్చి 13: ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ(BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnu vardhan reddy) అంటున్నారని తెలిసిందన్నారు. అయితే, అది విష్ణువర్ధన్ రెడ్డి మాయ కాదని, వైఎస్ జగన్(YS Jagan) మాయ అని వ్యాఖ్యానించారు. విష్ణువర్ధన్‌ను ప్రయోగించింది జగనే అని ఆరోపించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణ రాజు(MP Raghu Rama Krishna Raju).. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో తనకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు వైఎస్ జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

‘కూటమిలో తనకు టికెట్ దక్కకుండా విష్ణువర్ధన్ అడ్డుకుంటున్నాడని నాకు సమాచారం అందింది. అయితే, ఇది విష్ణు పని కాదు. జగన్ చేయిస్తున్న పని. విష్ణువర్ధన్‌ను జగనే ప్రయోగించాడు. నాకు సీకు రాకూడదని జగన్ ప్లాన్. బీజేపీకి ఇచ్చిన 6 స్థానాల్లో నరసాపురం కూడా ఉంటుంది. వైఎస్ జగన్ ఎందుకు భయపడుతున్నాడో తెలియడం లేదు. నాకు సీటు ఇస్తే జగన్‌కు వచ్చిన నష్టం ఏంటి? విష్ణు వర్ధన్ రెడ్డిది కదిరి.. ఆయనకు నరసాపురం గురించి ఎందుకు? నాపేరు కన్ఫామ్ అయిపోతే వారికి భయం ఎందుకు? నాకు టికెట్ ఇవ్వొద్దు అనే దాని వెనుక కుట్ర ఉంది. వారు ఎన్ని కుట్రలు చేసినా.. నాకు టికెట్ ఎలాగైనా వస్తుంది. పొత్తులను తెగగోట్టెందుకు విష్ణు అస్త్రాన్ని జగన్ వాడాడు.’ అంటూ రఘురామకృష్ణం రాజు సంచలన ఆరోపణలు చేశాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2024 | 05:13 PM