Share News

AP Politics: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత..

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:38 PM

YSRCP vs TDP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్‌సీపీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు గుడ్ చెప్పారు. నేరుగా వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

AP Politics: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత..
YSRCP vs TDP:

YSRCP vs TDP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్‌సీపీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు గుడ్ చెప్పారు. నేరుగా వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

తణుకు ప్రాంతానికి చెందిన వైసీపీ కీలక నేత పేకేరు శ్రీను ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే పని చేసిన శ్రీను.. అధినేత తీరుతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా శ్రీనికి తణుకు, భీమవరం నియోజకవర్గాల పరిధిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజల్లో శ్రీనుకు మంచి పేరు ఉంది.

Updated Date - Feb 15 , 2024 | 03:38 PM