Share News

Anitha: గుడ్డు పగిలింది... మంత్రి గుడివాడకు అనిత స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Feb 27 , 2024 | 02:50 PM

Andhrapradesh: మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై... మంత్రి గుడివాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రెస్‌మీట్‌లోనే అనిత కోడి గుడ్లు పగలు కొట్టారు.

Anitha: గుడ్డు పగిలింది... మంత్రి గుడివాడకు అనిత స్ట్రాంగ్ కౌంటర్

విశాఖపట్నం, ఫిబ్రవరి 27: మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు (Ministr Gudivada Amarnathh) రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (TDP Leader Vangalapudi Anitha) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై... మంత్రి గుడివాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రెస్‌మీట్‌లోనే అనిత కోడి గుడ్లు పగలు కొట్టారు. ఆపై మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ అమర్నాథ్ మెదడు మోకాలులో ఉందన్నారు. గుడివాడ.. ముద్ద పప్పుకి తక్కువ... గన్నేరు పప్పుకి ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు.

కోడి గుడ్డు మంత్రి పని అయిపోయిందని.. గుడివాడ నోటి దురద వలన ఆయనకు టికెట్ రాలేదన్నారు. తన మీద విమర్శలు చేస్తున్నారని.. తనకు టికెట్ వచ్చిందని.. గుడివాడ అమర్ కే టికెట్ లేదని సెటైర్ విసిరారు. ‘‘ఐటి మంత్రి... ఒక కంపెనీ అయినా తెచ్చారా? గుడివాడ నీ స్థాయి ఏమిటి?.. నా స్థాయి ఏమిటి? ఎక్కువ మాట్లాడితే.. మేము, జనసేన సైనికులు తరిమి కొడతాము. నేను ఇప్పుడు మాట్లాడి... అనవసరంగా అమర్నాత్ స్థాయి పెంచుతున్నాం. దమ్ముంటే... గుడివాడ తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలి. పిడత పట్టుకొని... మిడత లా ఉన్నారు గుడివాడ అమర్నాథ్’’ అంటూ అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 27 , 2024 | 02:50 PM