Share News

TDP: అవినీతి లెక్కలు చూసుకోవడానికే జగన్‌ జిల్లాల పర్యటన: పట్టాభి

ABN , Publish Date - Apr 23 , 2024 | 02:04 PM

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేముందని, చెప్పుకోడానికి కూడా ఏమీ లేదని.. ఆయన జిల్లాల పర్యటనకు ఎందుకు తిరుగుతున్నారన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందన్నారు.

TDP: అవినీతి లెక్కలు చూసుకోవడానికే జగన్‌ జిల్లాల పర్యటన: పట్టాభి
TDP.. Pattabhiram..

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి (TDP Leader) పట్టాభిరామ్ (Pattabhiram)తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతి (Amaravati)లో మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేముందని, చెప్పుకోడానికి కూడా ఏమీ లేదని.. ఆయన జిల్లాల పర్యటనకు (Districts Visit) ఎందుకు తిరుగుతున్నారన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందన్నారు. అంతా దోపిడీ, నాశనం తప్పితే ఏం లేదన్నారు. మళ్లీ వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చేదిలేదని ముఖ్యమంత్రికి అర్ధమయిందని.. అందుకే రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒకసారి తిరిగి.. అవినీతి లెక్కలు చూసుకోవడానికే సీఎం జగన్‌ జిల్లాల పర్యటన చేస్తున్నారని ఆయన విమర్శించారు.


గడిచిన ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ అన్ని జిల్లాల్లో అక్రమాలకు పాల్పడ్డారని పట్టాభిరామ్ ఆరోపించారు. అవినీతి లెక్కలు తేల్చుకోవడానికే జగన్‌ బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు. విజయనగరం జిల్లాను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని అన్నారు. ప్రజలకు చెప్పుకోవడానికి సీఎం జగన్‌ చేసిన మంచి ఏమీ లేదని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగ్గంపేటలో చంద్రబాబు ప్రజాగళం దృశ్యాలు..

విజయనగరం జిల్లా: మహిళల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు

తొలి సంతకం దానిపైనే: చంద్రబాబు

ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ప్రతి పనికి ఓ రేటు..

జగన్ ‘నాడు-నేడు’ బాగోతం..

నా గెలుపు ఖాయం

Read Latest AP News and Telugu News

National News and Sports News

Updated Date - Apr 23 , 2024 | 02:04 PM